వారం రోజుల్లో రూ.లక్ష జమ : కలెక్టర్ రాహుల్ రాజ్

వారం రోజుల్లో రూ.లక్ష జమ : కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్​టౌన్, పెద్దశంకరంపేట, వెలుగు: అర్హులందరికీ పక్కా ఇండ్లు నిర్మించాలన్నదే  ప్రభుత్వ ధ్యేయమని కలెక్టర్​ రాహుల్​రాజ్​అన్నారు. శుక్రవారం ఆయన పెద్దశంకరంపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. కమలాపూర్ గ్రామం​లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఇంటి నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ... మెదక్​ జిల్లాకు  9 వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని, 4,500 ఇండ్లు గ్రౌండింగ్ చేసినట్లు చెప్పారు.

బేస్​మెంట్​పూర్తయిన ఇండ్లకు జీపీ సెక్రెటరీ ఫొటో తీసి పంపిన వారం రోజుల్లోనే లబ్ధిదారుడి అకౌంట్​లో రూ.లక్ష  జమవుతున్నాయని తెలిపారు. అనంతరం గ్రామంలో   ఫ్రైడే -డ్రై డే కార్యక్రమాన్ని పరిశీలించారు. సీజనల్‌ వ్యాధులు సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. పీహెచ్​సీలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలన్నారు.  ప్రతీ ఇంటిని ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు సందర్శించి పారిశుధ్యంపై అవగాహన కల్పించాలన్నారు.