
- నీలం మధు
పటాన్చెరు,వెలుగు: కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ సీనియర్నేత నీలం మధు అన్నారు. తెలంగాణ మంత్రి వర్గంలో బహుజనులకు ప్రాధాన్యం ఇవ్వడాన్ని స్వాగతిస్తూ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ఫ్లెక్సీకి చిట్కుల్ లోని ఎన్ఎంఆర్ క్యాంపు ఆఫీసులో క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ.. తెలంగాణ మంత్రి వర్గంలో ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి శ్రీహరి, ఎస్సీ నుంచి వివేక్ వెంకటస్వామి,అడ్లూరి లక్ష్మణ్ కు మంత్రి పదవులు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ నిబద్ధతకు నిదర్శనమన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి చొరవతోనే ముదిరాజ్ బిడ్డకు మంత్రి వర్గంలో పెద్ద పీట వేశారని కొనియాడారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత ఇస్తూ అన్ని కులాలకు అవకాశాలు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఎన్ఎంఆర్ యువ సేన సభ్యులు, సోషల్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.