
కోహెడ (హుస్నాబాద్), వెలుగు: దేవాలయాల నిర్మాణంతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తుందని కాంగ్రెస్ నేత నీలం మధు అన్నారు. శుక్రవారం అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామంలో ఏర్పాటుచేసిన పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన, ఆలయ ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు.
అనంతరం మధు మాట్లాడుతూ.. ముదిరాజుల ఆరాధ్య దైవమైన పెద్దమ్మతల్లి ఆలయాన్ని నిర్మించుకోవడం సంతోషకరమన్నారు. ఆలయాల అభివృద్ధికి ఎల్లప్పుడూ తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. దేవాలయాల నిర్మాణంతో భక్తిభావం అలవడడంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గంగాధరి రాజయ్య, మల్లేశ్, రాజయ్య, సురేందర్, ఎన్ఎమ్ఆర్ సోషల్ మీడియా నియోజకవర్గ ఇన్చార్జి శ్రీనివాస్, రవి, శ్రీనివాస్, గణేశ్, సంపత్, మహేశ్, ముదిరాజ్ సంఘం నాయకులు పాల్గొన్నారు.