
హనుమకొండ బస్ డిపోలో కరోనా కలకలం రేగింది. వరంగల్ లోకల్ బస్సుకు చెందిన ఓ మహిళా కండక్టర్కి కరోనా సోకింది. ఆ కండక్టర్ 15 రోజుల పాటు సిక్ లీవ్లో ఉండి రెండు రోజుల క్రితమే డ్యూటీలో జాయిన్ అయినట్లు సమాచారం. కండక్టర్ చెన్నూరు నుంచి హనుమకొండకు వెళ్లాల్సిన బస్సులో కండక్టర్గా విధులు నిర్వర్తిస్తోంది. కాగా.. శనివారం నుంచి ఆమెకు దగ్గు వస్తుండటంతో చెన్నూరు బస్టాండ్లో అధికారులు ఆంటీజెన్ డిటెక్షన్ టెస్ట్ చేయించారు. ఆ పరీక్షలో కండక్టర్కు పాజిటివ్గా నిర్ధారణ కావడంతో ఆర్టీసీ సిబ్బంది ఆందోళనలో ఉంది. డ్యూటీ ఆఫీసర్కు కూడా కరోనా లక్షణాలు ఉన్నట్లు తెలుస్తోంది. కండక్టర్ కు కరోనా సోకడంతో.. అధికారులు బస్సును ఖాళీగా హనుమకొండకు పంపించారు.
For More News..
అమెజాన్లో ఆఫర్ల వెల్లువ.. రూ. 1.6 లక్షల టీవీ రూ. 79 వేలకే..
వామ్మో.. జయమ్మ పంచాయితీ మామూలుగా లేదుగా