బెంగళూరు: ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ను సహించలేని పెద్దలు ఓ జంటను రాళ్లతో కొట్టిచంపారు. కర్నాటకలోని గదగ జిల్లా లక్కలకట్టిలో ఈ దారుణం జరిగింది. పోలీసుల వివరణ ప్రకారం.. రమేశ్ మదార్, గంగమ్మలది ఎస్సీ వర్గమే అయినా, ఉప కులాలు వేరు. పెద్దలు నో చెప్పడంతో పారిపోయి పెండ్లి చేసుకుని,వలసకూలీలుగా జీవించారు. నాలుగేండ్ల తర్వాత బుధవారం ఊరికి తిరిగొచ్చిన జంటను చూసి అమ్మాయి బంధువులు కోపంతో రగిలిపోయారు. రోడ్డుపైనే ఇద్దరిపై దాడిచేసి, ఆ తర్వాత రాళ్లతో కొట్టిచంపారు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
