ప్రజల రక్షణే ధ్యేయంగా విధులు నిర్వహించాలి : సీపీ అనురాధ

ప్రజల రక్షణే ధ్యేయంగా విధులు నిర్వహించాలి : సీపీ అనురాధ

చేర్యాల, వెలుగు: ప్రజల రక్షణే ధ్యేయంగా విధులు నిర్వహించాలని సీపీ అనురాధ  సిబ్బందికి  సూచించారు. గురువారం చేర్యాల, మద్దూరు పీఎస్​లను సందర్శించారు. పీఎస్​పరిసరాలను,సీజ్​ చేసిన వాహనాలను, రిసెప్షన్​, రైటర్​ రూమ్​లను పరిశీలించారు. వివిధ కేసులలో ఉన్న వాహన యజమానుల అడ్రస్​ తెలుసుకుని అప్పగించాలని ఎస్ఐలకు సూచించారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి సాధ్యమైనంత త్వరగా వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. 

పీడీఎస్​ రైస్​ అక్రమ రవాణా జరగకుండా ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. పోలీస్​ ఆఫీసర్లు గ్రామాలను సందర్శిస్తూ ఇన్ఫర్మేషన్​ వ్యవస్థను మెరుగుపరుచుకోవాలని సూచించారు. స్థానిక సర్కిల్​ ఆఫీస్​లో మొక్క నాటారు. ఆమె వెంట ఏసీపీ సదానందం, సీఐలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు ఉన్నారు.