
చేర్యాల, వెలుగు: ప్రజల రక్షణే ధ్యేయంగా విధులు నిర్వహించాలని సీపీ అనురాధ సిబ్బందికి సూచించారు. గురువారం చేర్యాల, మద్దూరు పీఎస్లను సందర్శించారు. పీఎస్పరిసరాలను,సీజ్ చేసిన వాహనాలను, రిసెప్షన్, రైటర్ రూమ్లను పరిశీలించారు. వివిధ కేసులలో ఉన్న వాహన యజమానుల అడ్రస్ తెలుసుకుని అప్పగించాలని ఎస్ఐలకు సూచించారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి సాధ్యమైనంత త్వరగా వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు.
పీడీఎస్ రైస్ అక్రమ రవాణా జరగకుండా ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. పోలీస్ ఆఫీసర్లు గ్రామాలను సందర్శిస్తూ ఇన్ఫర్మేషన్ వ్యవస్థను మెరుగుపరుచుకోవాలని సూచించారు. స్థానిక సర్కిల్ ఆఫీస్లో మొక్క నాటారు. ఆమె వెంట ఏసీపీ సదానందం, సీఐలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు ఉన్నారు.