న్యూఢిల్లీ: పంట బీమా తీసుకోవాలా వద్దా అనే నిర్ణయాన్ని రైతులకే వదిలేస్తున్నట్లు కేంద్ర కేబినెట్ బుధవారం వెల్లడించింది. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో బుధవారం కేబినెట్ భేటీ జరిగింది. ఇందులో ఫసల్బీమా స్కీంలో మార్పులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వివిధ రైతు సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేబినెట్ తెలిపింది. ప్రధాన మంత్రి ఫసల్బీమా యోజన(పీఎంఎఫ్బీవై) పథకం ప్రకారం.. బ్యాంకు రుణం తీసుకున్న రైతు తప్పనిసరిగా పంటకు బీమా చేయించాల్సిందే. అయితే, రైతుల విజ్ఞప్తి నేపథ్యంలో కేంద్ర కేబినెట్ ఈ స్కీంలో మార్పులు చేసింది. పంట బీమా చేయడం ఇకపై తప్పనిసరి కాదని చెప్పింది. ఇప్పుడున్న రైతుల్లో 58 శాతం రైతులు రుణాలు తీసుకుని సాగు చేస్తున్నవారే. ఈ క్రమంలో పీఎంఎఫ్బీవై స్కీంపై వివిధ రైతు సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చెప్పారు. దీంతోనే పీఎంఎఫ్ బీవై స్కీంను కంపల్సరీ నుంచి ఆప్షనల్గా మార్చేసినట్లు వివరించారు. పీఎంఎఫ్ బీవై స్కీం అద్భుత పథకమని మంత్రి కొనియాడారు. ఈ స్కీం కింద ఇప్పటివరకు రూ.13 వేల కోట్లు ప్రీమియంగా స్వీకరించామని, రూ.60 వేల కోట్ల ఇన్సూరెన్స్ క్లెయింలు పరిష్కరించామని మంత్రి తోమర్ చెప్పారు.
గ్రామాల్లో రెండో దశ స్వచ్ఛ భారత్..
గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్ మిషన్ రెండో దశ ప్రారంభించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణతో పాటు బహిరంగ మల, మూత్ర విసర్జనను రూపుమాపేందుకు ఈ స్కీం ఉపయోగపడుతుంది. ఈ స్కీం తొలిదశ ఇప్పటికే అయిపోయింది. అంతకుముందు దేశవ్యాప్తంగా 38.7 శాతంగా ఉన్న శానిటేషన్ కవరేజ్.. ఈ పథకం తర్వాత గరిష్ఠంగా పెరిగిందని మంత్రులు తెలిపారు. కేంద్రం ఈ పథకం అమలులోకి తెచ్చాక.. సుమారు 10 కోట్ల మంది వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించుకున్నారని చెప్పారు. తాజాగా, దీన్ని మలిదశ కూ విస్తరించాలని కేబినెట్నిర్ణయించినట్లు పేర్కొన్నారు. 2020–21, 2024–25 పీరియడ్లలో నిర్వహించనున్న ఈ పథకానికి కేంద్ర రాష్ట్రాల బడ్జెట్ సుమారు రూ52,497 కోట్లని అంచనా వేసినట్లు జలశక్తి మినిస్ట్రీ ఓ ప్రకటనలో పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరా, శానిటేషన్ పనుల కోసం 15వ ఫైనాన్స్ కమిషన్ రూ.30,375 కోట్ల కేటాయింపులు జరిపింది. గ్రామాల్లో ఇంటింటికీ టాయిలెట్ ఉందని మరోసారి నిర్ధారించుకోవాలంటూ శానిటేషన్ డిపార్ట్మెంట్ రాష్ట్రాలకు సూచించింది.
22వ లా కమిషన్ఏర్పాటుకు ఓకే
కాంప్లెక్స్ లీగల్ ఇష్యూల్లో ప్రభుత్వానికి సలహా ఇచ్చేందుకు 22వ లా కమిషన్ను ఏర్పాటుచేయాలని కేబినెట్నిర్ణయించింది. గతేడాది ఆగస్టు 31తో ఇంతకుముందున్న కమిషన్ టెర్మ్ పూర్తయింది. ఈ నేపథ్యంలో కొత్త కమిషన్ ఏర్పాటు ప్రపోజల్కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో మూడేళ్ల టైంపీరియడ్తో కొత్త ప్యానెల్ ఏర్పాటుకు న్యాయ మంత్రిత్వ శాఖ ఏర్పాట్లు మొదలు పెట్టనుంది. ఈ ప్యానెల్లో ఒక ఫుల్టైం చైర్పర్సన్, నలుగురు ఫుల్టైం సభ్యులు, న్యాయ మంత్రిత్వ శాఖ నుంచి ఇద్దరు సెక్రెటరీలు ఎక్స్ అఫీషియో మెంబర్లుగా వ్యవహరిస్తారు. వీరితో పాటు ఐదుగురికి మించకుండా టెంపరరీ సభ్యులను కూడా నియమించుకోవచ్చు అని అధికారికంగా స్టేట్మెంట్ విడుదల చేసింది.
అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ(రెగ్యులేషన్) బిల్
అసిస్టెడ్రిప్రొడక్టివ్టెక్నాలజీ(సరోగసి, ఐవీఎఫ్.. తదితర పద్ధతుల)కు సంబంధించి జాతీయ రిజిస్ట్రీ ఏర్పాటు చేయాలని, ఈ రంగంలో సేవలందిస్తున్న ఆస్పత్రులు, డాక్టర్లు, ఇతర సిబ్బంది కోసం రిజిస్ట్రేషన్ అథారిటీ ఉండాలన్న ప్రతిపాదనలకు కేబినెట్ ఓకే చెప్పింది. ఈ ప్రతిపాదనలతో తీసుకొచ్చిన సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. దీంతో పాటు ఈ బిల్లులో మానవ పిండాల అమ్మకం, సెక్స్సెలక్షన్ ప్రాక్టీస్ కు పాల్పడేవారిని కఠినంగా శిక్షించేందుకు ప్రతిపాదనలను పొందుపరిచారు. ఈమేరకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఈ బిల్లుకు సంబంధించిన వివరాలను కేబినెట్కు తెలిపారు.