న్యూ ఇయర్​ ట్రీట్​.. ఒకరోజు ముందే ‘దావత్’ 

న్యూ ఇయర్​ ట్రీట్​.. ఒకరోజు ముందే ‘దావత్’ 

కొత్త ఏడాదికి ముందే ఆడియెన్స్​కి ‘దావత్​’ ఇవ్వబోతోంది జీ తెలుగు. కాకపోతే మెనూలో వంటకాలకి బదులు ఎంటర్​టైన్​మెంట్​ వడ్డించబోతోంది. దానికి సంబంధించిన ప్రోమో రీసెంట్​గా రిలీజ్​ అయింది. అందులో కామెడీ మిస్సైల్​ బ్రహ్మానందం సెంటరాఫ్ అట్రాక్షన్​.  ఎప్పటిలాగే తన కామెడీ టైమింగ్​తో నవ్వులు పూయించాడు. నాగబాబు.. సింగర్ రేవంత్​తో కలిసి ‘భలే మంచి రోజూ..’ అంటూ పాట పాడాడు కూడా.  మరో స్టార్ కమెడియన్​ అలీ తన భార్య జుబేదా కోసం ఒక పాట పాడినట్టు ప్రోమోలో కనిపించింది. 

నాగబాబు భార్య పద్మజ కూడా ఈ  షోలో సందడి చేయబోతోంది. అలాగే ఈవెంట్​లో బ్రహ్మానందం, అలీకి ఒక స్పెషల్ డాన్స్ ట్రిబ్యూట్ ప్లాన్​ చేసింది జీ తెలుగు. యాంకర్​ ప్రదీప్​ స్కూల్​ ఫ్రెండ్స్​ కూడా ఈ దావత్​లో కనిపించ బోతున్నారు. ఇన్ని స్పెషల్​ ఎలిమెంట్స్ ఉన్న ఈ షో డిసెంబర్​ 26న సాయంత్రం ఆరింటికి టెలికాస్ట్​ కానుంది. ఈ టీవీ కూడా ఈ న్యూఇయర్​కి ‘పెళ్లాం వద్దు పార్టీ ముద్దు’ ఈవెంట్​తో ఆడియెన్స్​ ముందుకు రాబోతోంది. దానికి సంబంధించిన ప్రోమో కూడా రిలీజ్​ చేసింది ఛానెల్. టీవీ సెలబ్రిటీలతో పాటు సినిమా స్టార్స్​ కూడా సందడి చేయబోతున్న ఈ ఈవెంట్​లో ఆర్జీవీ కూడా కనిపించబోతున్నాడు. ప్రోమోతోనే అంచనాలు పెంచేసిన ఈ షో డిసెంబర్​–31 రాత్రి 9.30 నిమిషాలకి టెలికాస్ట్​ అవనుంది.