మోడీ-షాలను నమ్మితే అద్వానీ పరిస్థితి ఏమైంది?

మోడీ-షాలను నమ్మితే అద్వానీ పరిస్థితి ఏమైంది?
  • వాళ్లిద్దరూ దేశాన్ని మోసం చేస్తున్నారు: దిగ్విజయ్

భోపాల్: ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాలపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఫైర్ అయ్యారు. వాళ్లు ఓట్ల కోసం అబద్ధాలు చెబుతూ దేశాన్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు. వాళ్లని అద్వానీ నమ్మారని, కానీ ప్రస్తుతం ఆయన పరిస్థితి ఏంటో, ఆయన ఎక్కడున్నారో ప్రజలు తెలుసుకోవాలన్నారు.

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగిన ఓ సభలో దిగ్విజయ్ మాట్లాడారు. మోడీ, షా కలిసి ఓట్లు రాబట్టుకునేందుకు దేశ ప్రజల్ని ఫూల్స్‌ చేస్తున్నారని ఆరోపించారు. వాళ్లిద్దరూ ఎవరికీ మంచి చేసే స్నేహితులు కాదని అన్నారాయన. వాళ్లను నమ్మిన అద్వానీ ఇప్పుడు ఏమైయ్యారో కూడా తెలియదని చెప్పారు. ట్రిపుల్ తలాక్ గురించి ఆందోళన వ్యక్తమవుతుంటే వాళ్లకు పట్టడం లేదన్నారు. ప్రథమ సేవకుడిగా ఉండాల్సిన ప్రధాని మోడీజీ.. ప్రజలకు సేవ చేయడం గురించి ఆలోచించండి అన్నారు దిగ్విజయ్. పౌరసత్వ సవరణ చట్టం గురించి ప్రస్తావిస్తూ భారత రాజ్యాంగాన్ని నమ్మే ఏ ఒక్క పౌరుడూ ఈ చట్టాన్ని ఒప్పుకోడని చెప్పారు.