మనదేశానికి కేవలం ఒక్కరోజు రాజధానిగా ఉన్న నగరమేదో తెలుసా? ఆ ఘనత ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్(ఇప్పటి ప్రయాగ్రాజ్)ది. ఆ సంగతేంటంటే.. 1772 నుంచి కలకత్తా(ఇప్పటి కోల్కతా) రాజధానిగా ఇండియాను ఈస్ట్ ఇండియా కంపెనీ పాలించేది. అయితే 1857లో మీరట్ కేంద్రంగా సిపాయిల తిరుగుబాటు జరిగింది. దీన్నే ప్రథమ స్వాతంత్ర్యపోరాటంగా చెప్తారు. ఈ ఉద్యమాన్ని అణచివేశాక ఇండియా పాలన బాధ్యతలను ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్ ప్రభుత్వం తీసుకోవాలని అనుకుంది. దీనిపై 1858లో క్వీన్ విక్టోరియా ఆర్డర్స్తో ఉన్న లెటర్ అప్పటి వైస్రాయ్ జనరల్ లార్డ్ క్యానింగ్కు చేరింది. లెటర్ అందే సమయానికి ఆయన అప్పటి నార్త్వెస్ట్రన్ ప్రావిన్స్(ఇప్పటి ఉత్తరప్రదేశ్) రాజధాని అయిన అలహాబాద్లో ఉన్నాడు. వెంటనే ఆయన అందుబాటులో ఉన్న స్థానిక రాజులు, చక్రవర్తులు, భూస్వాములతో అక్కడి మింటో పార్క్లో సమావేశం ఏర్పాటుచేశాడు. క్వీన్ విక్టోరియా పంపిన ఉత్తరం చదివి, పాలనను ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్ గవర్నమెంట్కు ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు ఆమోదం తెలిపాడు. అలాగే ఆ ఒక్కరోజుకు అలహాబాద్ను ఇండియా రాజధానిగా ప్రకటించాడు. అలా ఇండియాకు ఒక్కరోజు రాజధానిగా అలహాబాద్ చరిత్రకెక్కింది.
వెయ్యి కేజీల ప్లాస్టిక్తో..
‘క్విట్ ఇండియా’ ఉద్యమానికి 80 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ‘స్వచ్ఛభారత్’ మిషన్లో భాగంగా వెయ్యి కేజీల ప్లాస్టిక్ వేస్ట్తో ఈ విగ్రహం తయారుచేశారు. 20 అడుగుల ఎత్తు, ఆరు అడుగుల పొడవు, ఆరు అడుగుల వెడల్పుతో ఉన్న ఈ విగ్రహం బరువు 1,150 కేజీలు. నోయిడాలోని సెక్టార్ 137 ఏరియాలో విగ్రహాన్ని ఈ ఏడాది ఆగస్ట్ 9న ఆవిష్కరించారు.