వెలుగు బిజినెస్ డెస్క్: ఆగస్టులో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు రెట్టింపయ్యాయి. ఆగస్టు 2023లో ఈక్విటీ మ్యూచువల్ పండ్స్లో రూ. 20,245.26 కోట్ల పెట్టుబడులను ఇన్వెస్టర్లు పెట్టారు. జులై నెలలో ఈ పెట్టుబడులు రూ. 7,625.96 కోట్లే. మ్యూచువల్ ఫండ్స్లోని చాలా కేటగిరీల స్కీములలో పెట్టుబడులు పెరిగాయి. లార్జ్క్యాప్ ఫండ్స్, ఫోకస్డ్ ఫండ్స్, ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ మాత్రమే పెట్టుబడులను రాబట్టుకోలేకపోయాయి. సెక్టోరల్ కేటగిరీ మ్యూచువల్ ఫండ్స్ స్కీములలోకి రూ. 4,805.81 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. గత మూడు నెలలుగా ఈ సెక్టోరల్ కేటగిరీ మ్యూచువల్ ఫండ్స్ స్కీములలోకి పెట్టుబడులు పెరుగుతున్నాయి. స్మాల్ క్యాప్ కేటగిరీ మ్యూచువల్ ఫండ్స్ స్కీములు కూడా ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయి. ఈ కేటగిరీ స్కీములలో ఆగస్టులో రూ. 4,264.82 కోట్లు, జులైలో రూ. 4,171.44 కోట్లు పెట్టుబడులు పెట్టారు. ఫోకస్డ్ ఫండ్స్ నుంచి రూ. 471.10 కోట్లను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు. కిందటి అయిదు నెలల నుంచి ఫోకస్డ్ ఫండ్స్ స్కీముల నుంచి తమ డబ్బులను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకోవడం ఎక్కువైంది. లార్జ్ క్యాప్ కేటగిరీ స్కీముల నుంచి కూడా రూ. 348.98 కోట్లు బయటకు వెళ్లిపోయాయి. వరసగా నాలుగు నెలల నుంచి ఈ కేటగిరీ నుంచి విత్డ్రాయల్స్కే ఇన్వెస్టర్లు మొగ్గుచూపుతున్నారు.
డెట్మ్యూచువల్ ఫండ్స్.
డెట్మ్యూచువల్ ఫండ్స్ కేటగిరీలోని ఓవర్నైట్ ఫండ్స్, ఫ్లోటర్ ఫండ్స్, డైనమిక్ బాండ్ ఫండ్స్, కార్పొరేట్ బాండ్ ఫండ్స్, లాంగ్ డ్యూరేషన్ ఫండ్స్, గిల్ట్ ఫండ్స్, డైనమిక్ బాండ్ ఫండ్స్లోకి ఇన్ఫ్లోలు రికార్డయ్యాయి. మనీ మార్కెట్ పండ్స్లో మాత్రం చాలా తక్కువగా రూ. 91.49 కోట్లు వచ్చాయి. ఆగస్టులో లిక్విడ్ ఫండ్స్నుంచి భారీగా రూ. 26,823.68 కోట్ల పెట్టుబడులు బయటకు వెళ్లాయి. ఈ లిక్విడ్ ఫండ్స్జులైలో రూ. 51,938.41 కోట్ల ఇన్ఫ్లోలను రికార్డు చేశాయి.అల్ట్రా షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్ నుంచి రూ. 4,123 కోట్లను ఇన్వెస్టర్లు వెనక్కి
తీసుకున్నారు.
ఓవర్నైట్ ఫండ్స్.
డెట్మ్యూచువల్ ఫండ్స్ కేటగిరీలోని ఓవర్నైట్ పండ్స్ అత్యధికంగా పెట్టుబడులను ఆకర్షించాయి. ఈ కేటగిరీ ఫండ్స్లోకి రూ. 3,158.37 కోట్లు వచ్చాయి. ఫ్లోటర్ ఫండ్స్లోకి రూ. 2,324.61 కోట్లు ఆగస్టులోనూ, రూ. 2000.49 కోట్లు జులైలోనూ ఇన్వెస్టర్లు పెట్టుబడులుగా పెట్టారు. హైబ్రిడ్ కేటగిరీ ఫండ్స్లోకి కూడా ఆగస్టులో పెట్టుబడులు వచ్చాయి. జులై నెలలో ఈ కేటగిరీలో పెట్టుబడులు రూ. 12,420.74 కోట్లయితే, ఆగస్టులో ఈ మొత్తం రూ. 17,081.68 కోట్లకు పెరిగింది. ఆర్బిట్రేజ్ ఫండ్స్లోకి అత్యధికంగా రూ. 9,482.65 కోట్లు వచ్చి చేరాయి. డైనమిక్ ఎసెట్ యాలొకేషన్ అడ్వాంటేజ్ పండ్స్లో రూ. 3,616.01 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. ఇండెక్స్ఫండ్స్, ఈటీఎఫ్లలోకి ఆగస్టు నెలలో ఇన్వెస్టర్లు రూ. 4,535.18 కోట్లను పెట్టుబడిగా పెట్టారు.
మొత్తం ఏయూఎం రూ. 46.63 లక్షల కోట్లు..
ఆగస్టు చివరి నాటికి మొత్తం అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ రూ. 46.63 లక్షల కోట్లకు చేరాయి. జులై నెలలోని రూ. 46.37 లక్షల కోట్ల కంటే ఇది 0.56 శాతం ఎక్కువ. ఆగస్టు 2023లో 14 ఓపెన్–ఎండెడ్ న్యూ ఫండ్ ఆఫరింగ్స్ వచ్చాయి. ఇవన్నీ కలిపి రూ. 7,343 కోట్లను సమీకరించాయి. ఒకే ఒక్క క్లోజ్–ఎండెడ్ ఫండ్ రూ. 188 కోట్లను సేకరించింది.