ప్రణీత్ రావు ఎవరు.. ఫోన్ ట్యాపింగ్ తో సంబంధం లేదు : ఎర్రబెల్లి

ప్రణీత్ రావు ఎవరు.. ఫోన్ ట్యాపింగ్ తో సంబంధం లేదు : ఎర్రబెల్లి

కేసీఆర్ సారథ్యంలో పార్టీ కోసం ఒక సైనికుడిగా పనిచేస్తానన్నారు  మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారం ఓ ఫేక్ అని కొట్టిపారేశారు. తనకు పార్టీ మారే ఉద్దేశం లేదన్నారు. బీజేపీలోకి వెళ్తున్నట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని..   బీఆర్ఎస్ కార్యకర్తలను తప్పుదోవ పట్టించేందుకు ఇలా ప్రయత్నిస్తున్నారని చెప్పారు.   క్యాడర్ అవన్నీ నమ్మవద్దని  ఎర్రబెల్లి సూచించారు.  ఆనాడు  వైఎస్సార్ ఎన్నో ఇబ్బందులు పెట్టిన తాను పార్టీ మారలేదని చెప్పారు.  

ఎస్ఐబీ మాజీ డీఎస్పీ  ప్రణీత్రావు ఫోన్ ట్యాపింగ్ కేసుపై  ఎర్రబెల్లి స్పందించారు.  అసలు ప్రణీత రావు ఎవరో కుడా తెలియదన్నారు. నా పేరు చెప్పాలని ప్రణీత రావు మీద అధికారులు ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. బిజినెస్, ల్యాండ్ దందాలు, తప్పుడు పనులు చేసే నాయకులు అధికార పార్టీలోకి పోతున్నారని ఎర్రబెల్లి విమర్శించారు.  

కాంగ్రెస్ వంద రోజుల పాలన ఫెయిల్ అయిందని ప్రజలు అనుకుంటున్నారని ఎర్రబెల్లి చెప్పారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటిలు అమలు చేయలేదని..  ఎన్నికల కోసమే డ్రామా చేశారని ఆరోపించారు.  కనీసం కేసీఆర్ పెట్టిన పథకాలు కూడా అమలు చేయట్లేదని విమర్శించారు.  మాయ మాటలు చెప్పడం, మోసాలు చేయడం సీఎం రేవంత్ రెడ్డికి అలవాటేనన్నారు ఎర్రబెల్లి.  

ALSO READ :- మళ్ళీ చెట్టు చిగురిస్తుంది.. కాయలు కాస్తాయ్ : వినయ్ భాస్కర్

మండే వేసవిలో కూడా చెరువులు నింపిన మహానుభావుడు కేసీఆర్ అని కొనియాడారు ఎర్రబెల్లి.  నాయకులు పోయినంత మాత్రాన ఏమి కాదని..  కార్యకర్తలు దైర్యంగా ఉండాలన్నారు.  కార్యకర్తలు మీద తప్పుడు కేసులు పెడితే తాము పోలీస్ స్టేషన్ లో కూర్చుంటామని భరోసా ఇచ్చారు.  రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమన్న ఎర్రబెల్లి...  ఎన్టీఆర్ లాంటి నాయకునికి కూడా ఓటమి తప్పలేదని గుర్తుచేశారు.