ఈవీ మాన్యుఫాక్చరర్లకు 1.30 కోట్ల చదరపు అడుగులు కావాలె: సీబీఆర్​ఈ రిపోర్టు

ఈవీ మాన్యుఫాక్చరర్లకు 1.30 కోట్ల చదరపు అడుగులు కావాలె: సీబీఆర్​ఈ రిపోర్టు

న్యూఢిల్లీ: 2030 నాటికి దేశంలోని ఎలక్ట్రిక్​ వెహికల్స్​ మాన్యుఫాక్చరర్లకు 1.30 కోట్ల చదరపు అడుగుల స్థలం అవసరమవుతుందని రియల్​ ఎస్టేట్​ కన్సల్టింగ్​ కంపెనీ సీబీఆర్​ఈ ఒక రిపోర్టులో వెల్లడించింది. దేశంలో 2030 నాటికి 2.30 కోట్ల టూ వీలర్లు, 40 లక్షల ఫోర్​ వీలర్లు (కార్లు) తయారు చేయాలని టార్గెట్​గా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఎలక్ట్రిక్​ వెహికల్స్​ ఇన్​ ఇండియా–న్యూ వీల్స్​ ఆన్​ ది రోడ్స్​ పేరిట ఒక రిపోర్టును సీబీఆర్​ఈ సౌత్​ ఏషియా రిలీజ్​ చేసింది. ఎలక్ట్రిక్​  వెహికల్స్​ రంగంలోని ట్రెండ్స్​, గ్రోత్​, రియల్​ ఎస్టేట్​ సెక్టార్​పై ఆ రంగం ఎఫెక్ట్​ వంటి అంశాలన్నింటినీ ఈ రిపోర్టులో వివరించింది.

ఎలక్ట్రిక్​ వెహికల్స్​ మరింతగా వినియోగంలోకి తేవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ రంగంలో తయారీ ఫెసిలిటీలు పెట్టడానికి 1.30 కోట్ల చదరపు అడుగుల రియల్​ ఎస్టేట్​ స్పేస్​ కావల్సి వస్తుందని సీబీఆర్​ఈ రిపోర్టు తెలిపింది. ఇదే సమయంలో ఎలక్ట్రిక్​ వెహికల్స్​కు అవసరమయ్యే బ్యాటరీ మాన్యుఫాక్చరింగ్​ ఫెసిలిటీల ఏర్పాటుకు 2,400 ఎకరాల స్థలం అవసరమవుతుందని పేర్కొంది. 2030 నాటికి బ్యాటరీల తయారీలో 200 గిగావాట్​ హవర్స్​ కెపాసిటీ అందుకోవాలని లక్ష్యంగా నిర్దేశించారు. 2021–30 మధ్య కాలంలో మన  ఈవీ మార్కెట్​ ఏటా 49 శాతం పెరుగుతుందని సీబీఆర్​ఈ  రిపోర్టు అంచనా వేసింది.

2030 నాటికి దేశంలో ఈవీల అమ్మకాలు 1.70 కోట్ల యూనిట్లను దాటుతాయని పేర్కొంది. మొత్తం మీద ఆటోమోటివ్​ ఇండస్ట్రీలో ఈవీ మాన్యుఫాక్చరింగ్​ చాలా మార్పులు తెస్తుందని, దాంతోపాటు ఆ ఎఫెక్ట్​ రియల్​ ఎస్టేట్ సెక్టార్​పైనా ఉంటుందని వివరించింది. గత మూడేళ్లలో ఈవీ సెక్టార్లో పెట్టుబడులు చూస్తే ఇది స్పష్టమవుతోందని సీబీఆర్​ఈ వివరించింది. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా 6.2 బిలియన్ ​డాలర్ల మేర పెట్టుబడులను ఈవీ కంపెనీలు ప్రకటించాయి.