
విశ్వాసపరీక్షలో ఓటమి తర్వాత తనకు సహకరించిన మీడియాకు థ్యాంక్స్ అంటూ వెటకారంగా మాట్లాడి వెళ్లిపోయారు మాజీ సీఎం కుమారస్వామి. సభకు రాకుండా విప్ ను ధిక్కరించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరతామన్నారు సిద్ధరామయ్య. బీజేపీ తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని ఆరోపించారు. ప్రజాస్వామ్య విలువలను బీజేపీ పాతరేసిందని తీవ్రంగా విమర్శించారు కాంగ్రెస్, జేడీఎస్ నేతలు. సభలోనూ బీజేపీపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.