వికారాబాద్, వెలుగు: తాండూర్లో నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టైంది. ఇంటర్నెట్సెంటర్ నడుపుతున్న ఓ వ్యక్తి పలు మండలాల్లో ఏజెంట్లను పెట్టుకుని ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేసి అమ్ముతున్నాడు. ఇంటర్నెట్లో ఒరిజినల్ సర్టిఫికెట్లను డౌన్లోడ్ చేసి దానిలో ఉన్న సమాచారాన్ని ఫొటో షాప్ ద్వారా ఎడిట్చేసి జనన, మరణ పత్రాలు తయారు చేస్తున్నారు.
ఇలా పొందిన సర్టిఫికెట్లు ఫేక్ అని తెలుసుకున్న ఓ బాధితుడు మంగళవారం బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, తాండూర్లోని ఆసిఫ్ను అరెస్ట్ చేశారు. ఆసిఫ్ను విచారించగా ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలకు సంబంధించి వ్యక్తుల పేర్లు చెప్పినట్లు తెలిపారు. ఈ కేసులో చాలా మంది పాత్ర ఉందని, విచారణ లోతుగా చేపడుతున్నట్లు పోలీసులు వివరించారు.
