నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : రైతుల సంతోషమే ప్రభుత్వ లక్ష్యమని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డి తెలిపారు. శుక్రవారం తాడూరు, బిజినపల్లి, తిమ్మాజిపేట మండలాల్లో రైతులకు స్ప్రింక్లర్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు వారికి బదులు ప్రత్యామ్నాయ పంటలకు డ్రిప్ సిస్టం అవసరమని, రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఇందుకు స్పందించిన ప్రభుత్వం స్ప్రింక్లర్లను రైతులకు అందజేస్తోందన్నారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారు.
