
యాదాద్రి, సంస్థాన్ నారాయణపురం, వెలుగు: ట్రిపుల్ ఆర్అలైన్మెంట్మార్చాలని యాదాద్రి జిల్లా సంస్థాన్నారాయణపురంలో రైతులు మునుగోడు -నల్గొండ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు మాట్లాడారు. భూమిని నమ్ముకొని బతుకుతున్న తమకు జీవనోపాధి లేకుండా చేయవద్దని కోరారు.
పోలీసులు అక్కడికి చేరుకొని బాధితులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. బాధితులు యాదాద్రి కలెక్టరేట్కు ప్రదర్శనగా వచ్చి కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందించారు. ఇప్పటికైనా ట్రిపుల్ఆర్అలైన్మెంట్ మార్చాలని, లేనిపక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.