
న్యూఢిల్లీ: ఇండియన్ కస్టమ్స్ శాఖ పేరుతో మోసగాళ్లకు పాల్పడే వారి నుంచి జాగ్రత్తగా ఉండాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం ప్రజలను హెచ్చరించింది. " కస్టమ్స్ డ్యూటీ వ్యక్తిగత బ్యాంకు ఖాతా ద్వారా చెల్లించాలంటూ భారతీయ కస్టమ్స్ అధికారులు ఎప్పుడూ కాల్ చేయరు. ఎస్ఎంఎస్లు కూడా పంపరు. భారతీయ కస్టమ్స్ శాఖ నుండి వచ్చే అన్ని కమ్యూనికేషన్లు సీబీఐసీ వెబ్సైట్లో వెరిఫై అయిన డీఐఎన్ను కలిగి ఉంటాయి" అని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.