- చేపలమ్మే మహిళే బాధితురాలు
న్యూయార్క్: చైనాలోని వూహాన్ హోల్సేల్ఫుడ్ మార్కెట్లో చేపలు అమ్మే ఓ మహిళకే మొట్టమొదట కరోనా వచ్చిందని ఓ కొత్త స్టడీ తెలిపింది. కరోనా సోకిన ఆ మహిళ సెంట్రల్ చైనీస్ నగరంలోని హువానాన్ లైవ్ యానిమల్ మార్కెట్లో పనిచేసినట్లు స్టడీ పేర్కొంది. ఈ మేరకు న్యూయార్క్ టైమ్స్ గురువారం ఓ కథనం ప్రచురించింది. అరిజోనా యూనివర్సిటీకి చెందిన వోరోబే అనే ఎక్స్ పర్ట్.. ఇప్పటి వరకు వైరస్ పుట్టుకపై వచ్చిన జర్నల్స్తోపాటు, చైనీస్ న్యూస్ అవుట్లెట్లోని వీడియో ఇంటర్వ్యూలపై స్టడీ చేశాడు. హువానాన్ సీఫుడ్ హోల్సేల్ మార్కెట్కు, ఆసుపత్రిలో చేరిన రోగులకు గల సంబంధాలను విశ్లేషించాడు. మార్కెట్లోనే వైరస్ మొదటగా ప్రారంభమైందని వోరోబే తెలిపారు. వైరస్ పుట్టుక కనిపెట్టడానికి డబ్ల్యూహెచ్వో ఎంపిక చేసిన వారిలో ఓ సైంటిస్టు సహా చాలా మంది ఎక్స్పర్ట్లు వోరోబే స్టడీతో ఏకీభవించారు. అయితే వైరస్ఎలా పుట్టిందనే పెద్ద ప్రశ్నకు జవాబు చెప్పేందుకు ఆధారాలు సరిపోవడంలేదన్నారు.