రన్ వే నుంచి పక్కకు దూసుకెళ్లిన విమానం

రన్ వే నుంచి పక్కకు దూసుకెళ్లిన విమానం

మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ ఎయిర్ పోర్టులో ఓ విమానం రన్ వే దాటి దూసుకెళ్లింది. ఉదయం ఢిల్లీ నుంచి జబల్ పూర్ వచ్చిన విమానం.. రన్ వే దాటి బయటకు వెళ్లిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో 55 మంది ప్రయాణికులున్నారు. విమానం ల్యాండ్ అయ్యాక... స్పీడ్ కంట్రోల్ కాకపోవడంతోనే రన్ వే దాటి వెళ్లిపోయిందని ఎయిర్ పోర్టు అధికారులు చెప్పారు. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదన్నారు.