
- భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్
భద్రాచలం, వెలుగు : ఈనెల 29న భద్రాచలంలో, 30న దుమ్ముగూడెంలో నిర్వహించే ఉచిత క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ శిబిరాలను వినియోగించుకోవాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ సూచించారు. దీనికి సంబంధించిన వాల్పోస్టర్ను ఆయన శుక్రవారం ఆవిష్కరించారు. ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ, మారుతీ నర్సింగ్ కాలేజీ, లయన్స్ క్లబ్, వికాస తరంగిణీ, ఎస్ఆర్ఏఐ వాసవీ అసోషియేషన్(యూఎస్ఏ) సహకారంతో నిర్వహిస్తున్న ఈ శిబిరాలను గిరిజనులు ఉపయోగించుకోవాలని కోరారు.
క్యాన్సర్ వ్యాధి చికిత్సలో నిపుణులైన ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రి డాక్టర్లు, భద్రాచలంకు చెందిన ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్జయభారతి, సర్జికల్ అంకాలజిస్టు డాక్టర్ ఎం.మధుమోహన్రెడ్డి అందుబాటులో ఉంటారని తెలిపారు. పరీక్షలు చేసి ఆరోగ్యశ్రీ ఉన్న వారికి ఉచితంగా వైద్యం అందిస్తారని వివరించారు.