- గద్వాల కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్
గద్వాల, వెలుగు: జిల్లాలో మక్కజొన్న కొనుగోళ్లు ఇప్పటికే 70 శాతం కంప్లీట్ అయ్యాయని, మిగిలిన మొక్కజొన్నలను వచ్చే మూడు రోజుల్లో కొనుగోళ్లను కంప్లీట్ చేయాలని జోగులాంబ గద్వాల కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఆఫీసర్లను ఆదేశించారు.
గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డులో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. వర్షాలకు తడిసిపోకుండా బహిరంగ ప్రదేశాల్లో ఉంచిన మక్కజొన్నను ముందుగా తూకం వేయాలన్నారు.
