
రామచంద్రాపురం (పటాన్చెరు), వెలుగు: వియత్నాంలోని హోచిమిన్ సిటీ వియెన్ డాంగ్ కాలేజీ స్టూడెంట్స్కు గీతం వర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ నిరంజన్ అప్పస్వామి సైబర్సెక్యూరిటీపై శిక్షణ ఇవ్వనున్నారు. సీఎస్ఈ విభాగానికి చెందిన నిరంజన్ జూన్ 16 నుంచి జూలై 1 వరకు వియత్నాంలో జరిగే వర్క్షాప్కు హాజరై అక్కడి స్టూడెంట్స్కు శిక్షణ ఇస్తారు. ఆన్లైన్సైబర్ అటాక్స్కు వ్యతిరేకంగా పరిశోధనలు, సీ, సీ++, జావా, పైథాన్, డేటా స్ర్టక్చర్స్, నెట్ వర్క్ సెక్యూరిటీ వంటి సబ్జెక్టులపై దాదాపు 21 స్టడీ బుక్స్ను నిరంజన్ అందుబాటులోకి తెచ్చారు.
కోర్ జావా, ప్లట్టర్ ప్రోగ్రామింగ్, ఏఐ వినియోగంపై ఆయనకు చాలాసార్లు ఇంటర్నేషన్ సెమినార్స్, వర్క్షాప్లు నిర్వహించిన అనుభవం ఉంది. శుక్రవారం వియత్నాం వర్క్షాప్కు అధికారిక ఆహ్వానం అందడంతో గీతం వీసీ, డైరెక్టర్, ఇతర ఉన్నతాధికారులు నిరంజన్ను అభినందించారు.