వియత్నాం స్టూడెంట్స్కు గీతం ప్రొఫెసర్ శిక్షణ

వియత్నాం స్టూడెంట్స్కు గీతం ప్రొఫెసర్ శిక్షణ

రామచంద్రాపురం (పటాన్​చెరు), వెలుగు: వియత్నాంలోని హోచిమిన్​ సిటీ వియెన్​ డాంగ్​ కాలేజీ స్టూడెంట్స్​కు గీతం వర్సిటీ అసోసియేట్​ ప్రొఫెసర్​ నిరంజన్​ అప్పస్వామి సైబర్​సెక్యూరిటీపై శిక్షణ ఇవ్వనున్నారు. సీఎస్ఈ విభాగానికి చెందిన నిరంజన్​ జూన్​ 16 నుంచి జూలై 1 వరకు వియత్నాంలో జరిగే వర్క్​షాప్​కు హాజరై అక్కడి స్టూడెంట్స్​కు శిక్షణ ఇస్తారు. ఆన్​లైన్​సైబర్​ అటాక్స్​కు  వ్యతిరేకంగా పరిశోధనలు, సీ, సీ++, జావా, పైథాన్, డేటా స్ర్టక్చర్స్, నెట్​ వర్క్​ సెక్యూరిటీ వంటి సబ్జెక్టులపై దాదాపు 21 స్టడీ బుక్స్​ను నిరంజన్​ అందుబాటులోకి తెచ్చారు.

కోర్​ జావా, ప్లట్టర్​ ప్రోగ్రామింగ్, ఏఐ వినియోగంపై ఆయనకు చాలాసార్లు ఇంటర్నేషన్​ సెమినార్స్​, వర్క్​షాప్​లు నిర్వహించిన అనుభవం ఉంది. శుక్రవారం వియత్నాం వర్క్​షాప్​కు అధికారిక ఆహ్వానం అందడంతో గీతం వీసీ, డైరెక్టర్, ఇతర ఉన్నతాధికారులు నిరంజన్​ను అభినందించారు.