తెలంగాణ జాబ్​ స్పెషల్​: గవర్నర్​ జనరల్స్​

తెలంగాణ జాబ్​ స్పెషల్​: గవర్నర్​ జనరల్స్​

భా రత దేశంలో బ్రిటీష్​ సామ్రాజ్య వ్యాప్తిలో కొంత మంది గవర్నర్ జనరల్స్​ కీలక పాత్ర పోషించారు . ఈ క్రమంలో ఎన్నో సంస్కరణలు, చట్టాలను తీసుకువచ్చారు. వారన్ హేస్టింగ్స్​ కలకత్తాలో సుప్రీంకోర్టును ఏర్పాటు చేయగా, కారన్​ వాలీస్​ సివిల్​ సర్వీసులను ప్రవేశపెట్టి సివిల్​ సర్వీసుల పితామహునిగా నిలిచాడు. లార్డ్​ వెల్లస్లీ సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టి స్వదేశీ సంస్థానాలను ఆయుధరహితంగా మార్చాడు. లార్డ్​ హేస్టింగ్స్​ 28 యుద్ధాల్లో పాల్గొని 128 కోటలను జయించాడు. వారన్​ హేస్టింగ్స్​(1773-1786): రెగ్యులేటింగ్​ యాక్ట్​ –1773 ద్వారా బెంగాల్​ గవర్నర్​ జనరల్​గా వారన్​ హేస్టింగ్స్​ నియమితులయ్యారు.

మొదట తన జీవితాన్ని ఇంగ్లీష్​ ఈస్ట్​ ఇండియా కంపెనీలో రైటర్​గా ప్రారంభించాడు. పర్షియన్​, బెంగాల్​ భాషలు తెలిసిన ఏకైక గవర్నర్​ జనరల్​. జిల్లా స్థాయిలో దివాని, ఫౌజ్​దార్​ అదాలత్​ను ఏర్పాటు చేశాడు. కలకత్తాలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేశాడు. ఇతని కాలంలో మొదటి మహారాష్ట్ర యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో బ్రిటీష్​ వారికి అనుకూలంగా ఫలితాలు రాలేదు.

ఈ యుద్ధం 1782 సాలేబే సంధితో ముగిసింది. ఇతని కాలంలోనే రెండో మైసూర్​ యుద్ధం జరిగింది. 1774లో రోహిల్లా యుద్ధం జరిపి రోహిల్​ఖండ్​ను ఆక్రమించాడు. సొంత భూభాగాలను రక్షించుకోవడానికి ఇరుగు పొరుగు సరిహద్దుల వారితో రింగ్​ ఫెన్స్​ పాలసీని అనుసరించాడు. వారన్ హేస్టింగ్స్​ బ్రిటీష్​ పార్లమెంట్ లో 20 కేసులతో అభిశంసన తీర్మానం ఎదుర్కొన్నాడు. ఇందులో నందకుమార్​ కేసు, బైత్​సింగ్​ కేసు, అవధ్​ రాణితో అనుసరించిన కేసులు ఉన్నాయి. అయితే, ప్రభుత్వానికి సేవలు చేసినందుకు కేసుల నుంచి విముక్తి పొందాడు. ఇతడు ప్రాశ్చ్య సంస్కృతి పట్ల అభిమానం కలిగినవాడు. 1784లో ఏషియాటిక్​ సొసైటీ ఆఫ్​ బెంగాల్​ను స్థాపించాడు. దీనికి విలియం జోన్స్ అధ్యక్షుడిగా వ్యవహరించాడు. చార్లెస్​ విల్కిన్స్​ ఇంగ్లీష్​లోనికి అనువదించిన భగవద్గీతకు ఉపోద్ఘాతం రాశాడు.  

లార్డ్​ వారన్ హేస్టింగ్స్​ (1813–1823): ఇతని కాలంలో ముంబయి ప్రెసిడెన్సీ ఏర్పడింది. ఆంగ్లో–నేపాలీస్​ యుద్ధం 1814–16లో జరిగింది. పిండారీలను తీవ్రంగా అణచివేశాడు. ఇందుకుగాను సర్​ థామస్​ హిప్లాస్​ అనే సైన్యాధికారిని ఉపయోగించుకున్నాడు. భారతదేశంలో లార్డ్​ హేస్టింగ్స్​ 28 యుద్ధాల్లో పాల్గొన్నాడు. హేస్టింగ్స్​ మన దేశంలో 128 కోటలను జయించాడు. ఇతని కాలంలో మూడో మహారాష్ట్ర యుద్ధం జరిగింది.

ఇందులో పీష్వాలు పూర్తిగా ఓడిపోయి మహారాష్ట్ర నుంచి వెళ్లిపోయారు. రాజపుత్రులను బ్రిటీష్​ వారికి సహజ మిత్రులుగాను, మరాఠాలను సహజ శత్రువులుగా భావించిన ఏకైక గవర్నర్ జనరల్​. హేస్టింగ్స్​ కాలంలోనే భారతదేశంలో మొదటి వెర్నాక్యులర్​ న్యూస్​ పేపర్​ అయిన సమాచార్​ దర్పణ్​ ప్రారంభించబడింది. ఇతని కాలంలో మద్రాస్​ రాష్ట్రంలో సర్​ థామస్​ మన్రో నాయకత్వంలో రైత్వారీ విధానం ఏర్పాటు చేశారు. 

కారన్​ వాలీస్​ (1786-1793): భారతదేశంలో సివిల్​ సర్వీసుల పితామహునిగా పేరు పొందాడు. బెంగాల్​ ప్రెసిడెన్సీని నాలుగు డివిజన్లుగా విభజించాడు. ఉద్యోగాలకు జీతాలు చెల్లించడం ద్వారానే వారిలో నిజాయితీ, నైపుణ్యాన్ని పెంచవచ్చునని గుర్తించిన మొదటి గవర్నర్​ జనరల్​. వారన్​ హేస్టింగ్స్​ పరిచయం చేసిన న్యాయ విధానాన్ని స్థిరపరిచాడు. జమిందారులను పోలీస్​ విధుల నుంచి తప్పించాడు.

ఠాణాల పురాతన భారత విధానాన్ని ఆధునీకరించాడు. డిప్యూటీ సూపరింటెండెంట్​ ఆఫ్​ పోలీస్​ పోస్టును ఏర్పరిచాడు. పోలీసు అధికారుల్లో నిజాయితీ పెంచేందుకు వారి జీతాలు పెంచాడు. జిల్లా అధికార విధులను జిల్లా కలెక్టర్​కు అప్పగించాడు. కారన్​వాలీస్​ న్యాయ సంస్కరణల ప్రకారం న్యాయపాలన దిగువస్థాయిలో ఉంది. మున్సిఫ్​ కోర్టు, జిల్లా కలెక్టర్​ నుంచి సివిల్​ జడ్జి పోస్టును వేరు చేశాడు. ఇది సమానత్వ అంశాలతో కూడుకొని ఉంది. నాలుగు సర్క్యూట్​ కోర్టులను ఏర్పాటు చేశాడు. పాట్నా, ఢాకా, కలకత్తా, ముర్షిదాబాద్​లలో నాలుగు ప్రొవిన్షయల్​ కోర్టులను స్థాపించాడు.

ఈ కాలంలో జీవితఖైదు లేక మరణ శిక్షలను విధించే కోర్టులు ప్రొవిన్షియల్​ కోర్టు. కారన్​ వాలీస్​ కోడ్​ (1793) న్యాయపాలన నుంచి రెవెన్యూ పాలనను వేరుపరిచింది. ఇతని కాలంలో మూడో ఆంగ్లో మైసూర్ యుద్ధం జరిగింది. ఇందులో టిప్పుసుల్తాన్​ ఓడిపోయాడు. శ్రీరంగ పట్టణం సంధితో 1792లో యుద్ధం ముగిసింది. 1793 బెంగాల్​లో శాశ్వత శిస్తు విధానం ఏర్పాటు చేయడంలో సర్​ డాన్​ఫోర్​(1793–1798)  ప్రముఖ పాత్ర పోషించాడు. ఇతను అనుసరించిన విధానాన్నే తటస్థ విధానం అంటారు. 

లార్డ్​ వెల్లస్లీ (1798-1805): సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఇతను బెంగాల్​ టైగర్​ అని పిలువబడ్డాడు. ఇతని సైన్యసహకార పద్ధతి ద్వారా భారతదేశంలో బ్రిటీష్​ సార్వభౌమాధికారం ఉన్నత శిఖరాలకు చేరింది. ఈ ఒప్పందం ప్రకారం స్వదేశీ సంస్థానాదీశులు ఒక బ్రిటీష్​ రెసిడెంట్​ను తమ రాజధానిలో ఉంచుకుంటారు. ఇతను సంస్థానం అంతర్గత, బహిర్గత శాంతి భద్రతలను చూసుకొంటాడు. ఇందుకు ప్రతిగా బ్రిటీష్​ సైన్య పోషణకు కొంత భూభాగాన్ని బ్రిటీష్​ వారికి అప్పగించాలి.

సైన్య సహకార పద్ధతిలో చేరిన మొదటి స్వదేశీ రాజు హైదరాబాద్​ నిజాం. ఈ సైన్యసహకార పద్ధతి భారత రాజ్యాలను ఆయుధ రహితంగా చేసింది. 1802లో జరిగిన బసాయిన్​ సైన్య సహకార సంధిపై రెండో బాజీరావు, వెల్లస్లీ సంతకం చేశారు. భారతదేశ  రక్షణ వెల్లస్లీ కాలంలో కంపెనీ బాధ్యతగా మారింది. దుష్పరిపాలన కింద తంజావూర్​, కర్ణాటకలను ఆక్రమించి, మద్రాస్​ ప్రెసిడెన్సీని ఏర్పాటు చేశాడు. యువ సివిల్​ సర్వెంట్లకు శిక్షణ ఇచ్చేందుకుగాను 1800లో ఫోర్ట్​ విలియం కాలేజీని స్థాపించాడు. 


విలియం బెంటింగ్​​ (1828-35): బెంగాల్​ గవర్నర్​ జనరల్​గా ఉన్న విలియం బెంటింగ్​ 1833 చార్టర్​ చట్టం ప్రకారం మొదటిసారిగా భారత గవర్నర్​ జనరల్​గా మారాడు. పబ్లిక్​ ఇన్​స్ట్రక్షన్​ అధ్యక్షునిగా మెకాలేను నియమించాడు. థగ్గులను అణచివేశాడు. ఇందుకోసం 1831లో కల్నల్​ విలియం స్లీమాన్​ సేవలు వినియోగించుకున్నాడు. దాదాపు 1500 మంది థగ్గులను అరెస్టు చేశాడు. మైసూర్​, కూర్గ్​, సెంట్రల్​ కచ్చర్​లను ఆయా ప్రాంతాల్లో దుష్పరిపాలనాధారంగా ఆక్రమించాడు. అధికార భాషలుగా పర్షియన్​, వెర్నాక్యూలర్​ భాషలను బెంటింగ్​ గుర్తించాడు.

రంజిత్​సింగ్​తో స్నేహపూర్వక సంధిని ముగించాడు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ప్రాంతవాసుల సౌలభ్యానికి ప్రత్యేక సదర్​ నిజామత్, సదర్​ దివానీ అదాలత్​లను అలహాబాద్​లో ఏర్పరిచారు. కారన్​వాలీస్​ ప్రవేశపెట్టిన అప్పీల్, సర్క్యూట్​ ప్రొవెన్షియల్​ కోర్టులను 1831లో రద్దు చేశాడు. సాదరీ–దివాని–అదాలత్​, సాదరీ–నిజామత్​–అదాలత్​ను అలహాబాద్​లో ఏర్పాటుచేశాడు. న్యాయ సలహా సభ్యుడైన మెకాలే నివేదిక ప్రకారం ఈయన కాలంలో పర్షియా భాష స్థానంలో ఇంగ్లీష్​ను అధికార భాషగా గుర్తించారు.

లార్డ్​ మింటో (1807-1813): ఇతనికాలంలో 1809లో రంజిత్​సింగ్​తో అమృత్​సర్​ సంధి చేసుకున్నాడు. ఇతని కాలంలోనే 1813లో చార్టర్​ చట్టం వచ్చింది. దీనిపరంగా విద్య కోసం లక్ష రూపాయలు కేటాయించారు