ఇంటర్‌ ఫలితాలపై గవర్నర్‌ సీరియస్‌

ఇంటర్‌ ఫలితాలపై గవర్నర్‌ సీరియస్‌

పదో తరగతి మంచి మార్కులతో పాసైన స్టూడెంట్లకు ఇంటర్‌లో సున్నా మార్కులు ఎట్లొస్తయని గవర్నర్​నరసింహన్​ విద్యాశాఖ అధికారులను ప్రశ్నించారు. ఇంటర్​మార్కుల వ్యవహారంలో దొర్లిన తప్పిదాలపై ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు. ప్రాథమిక, ఇంటర్, విద్యాశాఖలపై గవర్నర్​సోమవారం రాజ్​భవన్​లో అధికారులతో సమీక్ష జరిపారు. ఇంటర్​మార్కుల్లో పొరపాట్లకు బాధ్యులన వారిపై ఏం చర్యలు తీసుకున్నారని గవర్నర్​అధికారులను అడిగారు. ఈ విషయంపై హైకోర్టు క్లీన్​చిట్​ ఇచ్చిందంటూ బోర్డు సెక్రటరీ అశోక్​కుమార్ ​చెప్పేందుకు ప్రయత్నించగా.. భవిష్యత్తులో ఈ తప్పులు రిపీట్​కాకుండా చూసుకోవాలని సూచించారు. ఇంజనీరింగ్​ఫీజుల వ్యవహారంపైనా గవర్నర్​ఆరా తీశారు. తర్వాత యూనివర్సిటీల్లో ఏటా స్నాతకోత్సవాలు నిర్వహించే ఏర్పాట్లు చేయాలని, విద్యలో నాణ్యత ప్రమాణాలు పెంచాలని, అకడమిక్ ​క్యాలెండర్ ​పక్కాగా అమలు చేయాలని అధికారులకు గవర్నర్​సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి, వైస్​చైర్మన్లు ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి, వెంకటరమణ, విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌ రెడ్డి, కళాశాల విద్యా కమిషనర్‌ నవీన్‌ మిట్టల్, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్, పాఠశాల విద్యా కమిషనర్‌ విజయ్‌ కుమార్‌ పాల్గొన్నారు.