ఒక బుల్లెట్టు తగిలితే.. స్పాట్లో చనిపోతారు. అలాంటిది ఓ బుల్లెట్ ని జీవితాంతం తన శరీరంతో పాటు మోస్తే. గద్దర్ (Gaddar) జీవితంలో ఆ విషాద ఘటన తాలూకు వివరాలు తెలుసుకుందాం. ఆయన ఇప్పటి వరకు ఒక తుపాకీ బుల్లెట్టును మోస్తూ ఉన్నారనే విషయం మీకు తెలుసా.
బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నారని ఆరోపిస్తూ అప్పటి టీడీపీ ప్రభుత్వం.. సీఎం చంద్రబాబునాయుడుకి వ్యతిరేకంగా ఆయన 1997 ఏప్రిల్6న హైదరాబాద్లో నిరసన తెలిపారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున జనసమీకరణ కావడంతో పోలీసులు నిరసనల్ని అణచివేయడానికి ప్రయత్నించారు.
ఈ క్రమంలో పోలీసులు గద్దర్పై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆయన్ని ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ ప్రారంభించారు. శరీరంలో అన్ని బుల్లెట్లు తొలగించినప్పటికీ ఒక బుల్లెట్ తీయడానికి డాక్టర్లు వెనకడుగేశారు.
కారణం ఆ బుల్లెటు తీస్తే గద్దర్ప్రాణానికే ప్రమాదం. దీంతో దాన్ని ఆయన ఒంట్లో అలాగే వదిలేశారు. ఆయన జీవిత చరమాంకం వరకు బుల్లెట్టుని తన శరీరంలో ఉంచుకున్న ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆగస్టు 6న తుది శ్వాస విడిచారు.