కోహ్లీ, తమన్నాకు హైకోర్టు నోటీసులు

కోహ్లీ, తమన్నాకు హైకోర్టు నోటీసులు

ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ పై మద్రాస్ హైకోర్టు సీరియస్ అయింది. ఆన్ లైన్ బెట్టింగ్ వెబ్ సైట్లకు సెలబ్రిటీలు ప్రచారం చేయడంపై హైకోర్టు ఆగ్రహాం వ్యక్తం చేసింది. సినీ, క్రీడా ప్రముఖులైన విరాట్ కోహ్లీ,గంగూలీ, తమన్నా, ప్రకాశ్ రాజ్, రానా, సుదీప్ లకు కోర్టు  నోటీసులిచ్చింది.

ఆన్ లైన్ రమ్మీకి ఎంతో మంది బానిసలుగా మారి… ఎంతో మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. ఈ క్రమంలో దీన్ని నిషేధించాలని ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీన్ని విచారించిన కోర్టు …ఆన్ లైన్ జూదానికి సంబంధించిన డబ్బు ఎక్కడకు పోతుందని తమిళనాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తెలంగాణలో ఆన్ లైన్ జూదాన్ని నిషేధించిన విషయాన్ని గుర్తు చేసిన మధురై బెంచ్… తమిళనాడులో అలాంటి ప్రయత్నాలు ఏమైనా చేశారా? అని అడిగింది. ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ నిషేధంపై పది రోజుల్లో చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్టు చెప్పారు. తదుపరి విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది.