- 10 శాతం గ్రోత్తో రూ. 3,832 కోట్లు
- రెవెన్యూ రూ. 26,672 కోట్లు
- ఇంటెరిమ్ డివిడెండ్ షేర్కు రూ. 12
హెచ్సీఎల్ టెక్నాలజీస్ లాభం సెప్టెంబర్ 2023 క్వార్టర్లో 10 శాతం పెరిగి రూ. 3,832 కోట్లకు చేరింది. అంతకు ముందు ఏడాది క్యూ2 లో కంపెనీకి రూ. 3,489 కోట్ల లాభం వచ్చింది. రెవెన్యూ తాజా సెప్టెంబర్ క్వార్టర్లో 8 శాతం ఎక్కువై రూ. 26,672 కోట్లయింది. కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఒక్కో ఈక్విటీ షేర్కు రూ. 12 చొప్పున ఇంటెరిమ్ డివిడెండ్ను రికమెండ్ చేసింది. కంపెనీ ప్రకటించిన లాభం, రెవెన్యూలు ఎనలిస్టుల అంచనాలను మించాయి.
హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఇబిటా అంతకు ముందు ఏడాది క్యూ2 తో పోలిస్తే తాజా క్యూ2 లో 11 శాతం పెరిగి రూ. 4,934 కోట్లకు చేరింది. రెండో క్వార్టర్లో హెచ్సీఎల్ టెక్ 16 పెద్ద డీల్స్ను దక్కించుకుంది. ఇందులో 10 సర్వీసెస్ డీల్స్ కాగా, మిగిలిన 6 సాఫ్ట్వేర్ డీల్స్గా కంపెనీ వెల్లడించింది. సెప్టెంబర్ క్వార్టర్లో వచ్చిన డీల్స్ విలువ 3.9 బిలియన్ డాలర్లని తెలిపింది. 2023–24 లో రెవెన్యూ గ్రోత్ 4 నుంచి 5 శాతం దాకా ఉండొచ్చని హెచ్సీఎల్ టెక్ గైడెన్స్ను ఇచ్చింది.
పూర్తి ఏడాదికి ఇబిటా మార్జిన్ 18 నుంచి 19 శాతం దాకా ఉండే ఛాన్స్ ఉందని పేర్కొంది. సెప్టెంబర్ క్వార్టర్లో 4 బిలియన్ డాలర్ల డీల్స్ దక్కించుకోవడంతో మీడియం టర్మ్లో పెర్ఫార్మెన్స్పై ఆశాభావం పెరిగిందని హెచ్సీఎల్ టెక్ సీఈఓ సీ విజయ్ కుమార్ చెప్పారు. సెప్టెంబర్ క్వార్టర్ చివరి నాటికి మొత్తం 2,21,139 ఉద్యోగులు కంపెనీలో పనిచేస్తున్నారు. అంతకు ముందు ఏడాది ఇదే క్వార్టర్తో పోలిస్తే ఉద్యోగుల వలస భారీగా తగ్గింది.