హైదరాబాద్, వెలుగు: ఇంటర్నేషనల్ మెషీన్ టూల్ అండ్ ఇంజినీరింగ్ ఎగ్జిబిషన్ ‘హిమ్టెక్స్2026’ హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో గురువారం ప్రారంభమైంది. ఐదు రోజులపాటు జరిగే ఈ వేడుకను ఏస్ అర్బన్ గ్రూప్ డైరెక్టర్ స్వాతి, ఎంఎస్ఎంఈ అదనపు డైరెక్టర్ రాజేష్ ప్రారంభించారు.
మానుఫ్యాక్చరింగ్, ఇంజినీరింగ్ రంగాలకు చెందిన సుమారు 300 సంస్థలు ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నాయి. ఆటోమేషన్, డిజిటలైజేషన్, అధునాతన ఇంజినీరింగ్ టెక్నాలజీలను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. సీఎన్సీ యంత్రాలు, మ్యాచినింగ్ సెంటర్లు, ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ మెషీన్లు, హైడ్రాలిక్ ప్రెస్లు, ఇండస్ట్రియల్ రోబోలు ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, నాలెడ్జ్ షేరింగ్ ద్వారా కంపెనీలు ఆధునిక తయారీ విధానాలకు మారడానికి హిమ్టెక్స్ ఉపయోగపడనుంది.
