న్యూఢిల్లీ: నగలపై ఉన్న హాల్మార్క్ సరైనదో, కాదో తెలుసుకోవడం ఇప్పుడు అవసరం. ఎందుకంటే దేశంలోని 256 జిల్లాలలో బుధవారం నుంచి జ్యుయెలరీకి హాల్మార్కింగ్ను తప్పనిసరి చేశారు. తర్వాత కాలంలో దీనిని ఇతర జిల్లాలలోనూ అమలు చేయనున్నారు. దీంతో నగలపై ఉన్న హాల్మార్క్ సరయినదో, కాదో తెలుసుకోవల్సిన అవసరం ఏర్పడుతోంది. జ్యుయెలర్ తనంతట తానుగా ఈ హాల్మార్క్ను వేశారా లేక ఆ హాల్మార్క్ కరెక్టేనా అనేది ఎలా కనుక్కోవాలో ఇప్పుడు చూద్దాం....
1. మొదటగా నగలపై ఉన్న హాల్మార్క్ను జాగ్రత్తగా గమనించండి. అందులో మూడు ఉండాలి. అవేమిటంటే, ట్రయాంగిల్తో కూడిన బీఐఎస్ (బ్యూరో ఆఫ్ఇండియన్ స్టాండర్డ్స్) మార్కింగ్ ఒకటి. ఎన్ని కేరట్లనేది (22కే915) కూడా ఉంటుంది. ఇదే బంగారం స్వచ్ఛత (ప్యూరిటీ) మనకు తెలియచేస్తుంది. జ్యుయెలర్మార్కు, ఏహెచ్సీ (ఎస్సేయింగ్అండ్ హాల్మార్కింగ్సెంటర్) మార్క్ కూడా ఉంటాయి.
2. తన బీఐఎస్ లైసెన్స్ను చూపించమని మనం జ్యుయెలర్ను అడగొచ్చు. బీఐఎస్ గైడ్లైన్స్ ప్రకారమైతే వారి లైసెన్స్ను కనబడేలా జ్యుయెలర్లు పెట్టాలి. ఆ స్లిప్పై ఉన్న అడ్రెస్ జ్యుయెలరీ షాపు అడ్రెస్ఒకటో, కాదో సరిపోల్చుకోవాలి.
3. బిల్బ్రేకప్ వివరాలను మనం కోరవచ్చు. బిల్లులో హాల్మార్కింగ్ఛార్జీలను ప్రత్యేకంగా చూపించమని కూడా మనం అడగొచ్చు. ఎస్సేయింగ్అండ్హాల్మార్కింగ్ సెంటర్లు జ్యుయెలర్ల నుంచి ఒక్కో ఐటమ్కు రూ. 35 చొప్పున ఛార్జ్ చేస్తాయి.
4. కొంత ఛార్జ్ చెల్లించి మనం కూడా నగలను ఏహెచ్సీలో చెక్ చేయించుకోవచ్చు. ఏహెచ్సీల అడ్రస్లు బీఐఎస్ వెబ్సైట్లో ఉంటాయి. సస్పెండయిన లేదా లైసెన్స్లు క్యాన్సిల్ చేసిన ఏహెచ్సీల వివరాలనూ ప్రత్యేకంగా ఈ వెబ్సైట్లో పెడతారు. కన్జూమర్లు ఇచ్చే నగలపై హాల్మార్కింగ్ను కూడా కొంత ఛార్జీతో ఈ ఏహెచ్సీలు టెస్ట్ చేస్తాయి. అలా టెస్ట్ చేసిన తర్వాత ఏహెచ్సీ మనకు ఒక రిపోర్టు ఇస్తుంది. ఒకవేళ బంగారం ప్యూరిటీ తక్కువగా ఉందని ఆ రిపోర్టులో ఉంటే, మొదట సర్టిఫికేషన్ ఇచ్చిన ఏహెచ్సీ కన్జూమర్కు ఫీజును రిఫండ్ చేయాల్సి ఉంటుంది.
5. ఆ రిపోర్టుతో జ్యుయెలర్ దగ్గరకు వెళ్లి నగల ప్యూరిటీ గురించి ప్రశ్నించొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో కన్జూమర్కు జ్యుయెలర్ తప్పనిసరిగా నష్టపరిహారాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
హాల్మార్కింగ్ గైడ్లైన్స్....
రూ. 40 లక్షలలోపు టర్నోవరుండే జ్యుయెలర్లను హాల్మార్కింగ్ రూల్ నుంచి మినహాయించారు.ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్స్, డొమెస్టిక్ బీ2బీ ఎగ్జిబిషన్స్కోసం చేసే జ్యుయెలరీకి కూడా హాల్మార్కింగ్ నుంచి మినహాయింపు ఇస్తున్నారు. అంతేకాదు 20, 23, 24 కేరట్ల బంగారానికి హాల్మార్కింగ్అవసరం ఉండదని రూల్స్ చెబుతున్నాయి. వాచీలు, ఫౌంటెన్పెన్లు, కుందన్, పొల్కి, జడావు వంటి స్పెషల్ టైపు జ్యుయెలరీకి హాల్మార్కింగ్ అవసరం లేదు.
పాత జ్యుయెలరీ సంగతేంటి..
కన్జూమర్ల దగ్గర నుంచి హాల్మార్కింగ్ లేకపోయినా పాత బంగారు నగలను జ్యుయెలర్లు కొనచ్చు. మాన్యుఫాక్చరర్లకు, హోల్సేలర్లకు, రిటెయిలర్లకు తగినంత టైము ఇచ్చే ఉద్దేశంతో ఆగస్టు చివరిదాకా ఎలాంటి పెనాల్టీలూ వేయరు. అంతేకాదు, పాత నగలకు కూడా కావాలనుకుంటే హాల్మార్కింగ్ వేయించుకోవచ్చు. లేదంటే, పాత నగలను కరిగించి కొత్త నగలుగా చేయించుకున్నాక హాల్మార్కింగ్ పొందవచ్చు. ఈ కొత్త స్కీము అమలులో వచ్చే ఇబ్బందులను పరిశీలించడం కోసం రెవెన్యూ అధికారులు, లీగల్ ఎక్స్పర్టులతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. హాల్మార్కింగ్ రూల్ గతంలోనే రావల్సినా, కరోనా వలన వాయిదాపడింది.
హాల్మార్కింగ్ రూల్ ఎందుకు తెచ్చారు...
బంగారం ప్యూరిటీ విషయంలో కస్టమర్లకు నమ్మకం కలిగించడానికి సాయపడుతుందనే ఉద్దేశంతోనే ప్రభుత్వం హాల్మార్కింగ్ను తప్పనిసరి చేసింది. అంతేకాదు, దీని వల్ల గ్లోబల్గా మన దేశం గోల్డ్మార్కెట్ సెంటర్గా మారుతుందనేది కూడా ప్రభుత్వ ఆలోచన. దేశంలో ఎస్సేయింగ్ సెంటర్లు (ఏహెచ్సీలు) గత అయిదేళ్లలో 25 శాతం పెరిగినట్లు గవర్నమెంట్చెబుతోంది. ఒక ఏహెచ్సీ ఒక రోజులో 1500 ఆర్టికల్స్కు హాల్మార్కింగ్ చేయగలదు. ప్రస్తుతం 14 కోట్ల ఆర్టికల్స్కు హాల్మార్కింగ్ వేసే కెపాసిటీ మనకు ఉంది.