ఢిల్లీ శివార్లలో కరాలా అనే ఒక ఊరు ఉంది. ఆ ఊళ్లో ఎంతోమంది అమ్మాయిలు కాంపిటీటివ్ పరీక్షలకు ప్రిపేర్ అవుతారు. ఎలాంటి ఫెసిలిటీస్ లేకుండా కాంపిటీటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవుతున్నారు. ఇది గమనించిన ఐఏఎస్ శ్వేతా శర్మ ఆడవాళ్లకు హెల్ప్ చేసేందుకు ముందుకు వచ్చారు.
ఈ ఊళ్లో ఇంజినీరింగ్, మెడిసిన్, యూపీఎస్సీ పరీక్షలకు పోటీపడుతున్న అమ్మాయిలు ఉన్నారు. వీళ్లతో పాటు చదువంటే ఎంతో ఇష్టపడే వాళ్లు ఉన్నారు. వీళ్లందరినీ ప్రోత్సహించడానికి నార్త్ ఈస్ట్ డిల్లీ సబ్ డివిజన్ కలెక్టర్ శ్వేతా శర్మ చొరవ తీసుకున్నారు. ఆ ఊరికి దగ్గరగా ఒక బిల్డింగ్ను తీసుకొని లైబ్రరీ ఏర్పాటు చేశారు. పోటీ పరీక్షల పుస్తకాలే కాకుండా అన్ని రంగాలకు సంబంధించిన పుస్తకాలు అందులో ఉంచారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఒక లైబ్రరీని ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. ఈ లైబ్రరీలో విమెన్ ఎడ్యుకేషన్ను ఎంకరేజ్ చేసే ఆర్ట్స్ ఉంటాయి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న మహిళల సమస్యలను తీర్చడానికి కౌన్సెలింగ్ సెంటర్గా కూడా దీన్ని వాడతాం అంటున్నారు ఐఏఎస్ శ్వేతా శర్మ. ఈ కమ్యూనిటీ- లెవల్ లైబ్రరీ రీడర్స్కు సెక్యూరిటీని కూడా ఇస్తుంది. ఊరికి దగ్గరగా ఉండటంతో చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. కిందటి ఏడాది ఈ ఊరికి చెందిన ఒక అమ్మాయి పోటీ పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకుంది. అప్పటికి అక్కడ ఎలాంటి సదుపాయాలు లేవు. ‘‘అమ్మాయిల కోసం అన్ని ఫెసిలిటీలతో లైబ్రరీ ఉంటే... కరాలాతో పాటు చుట్టుపక్కల ఊళ్లవాళ్లకు కూడా ఉపయోగపడుతుంది’’ అన్నారు శ్వేతా శర్మ.