IND vs ENG: నిప్పులు చెరుగుతున్న బుమ్రా, షమీ.. పీకల్లోతు కష్టాల్లో ఇంగ్లాండ్

IND vs ENG: నిప్పులు చెరుగుతున్న బుమ్రా, షమీ.. పీకల్లోతు కష్టాల్లో ఇంగ్లాండ్

230 పరుగుల లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ తడబడుతోంది. భారత పేసర్లు బుమ్రా, షమీ పేస్‌కు ఇంగ్లిష్ బ్యాటర్లు బెంబేలెత్తిపోతున్నారు. వీరిద్దరూ పోటీపడి వికెట్లు తీస్తున్నారు. 10 ఓవర్లు పూర్తయ్యేసరికి ఇంగ్లాండ్.. 4 వికెట్లు కోల్పోయి 40 పరుగులు చేసింది.

ఓపెనర్లు డేవిడ్ మలన్ (12), జానీ బెయిర్ స్టో (8) ధాటిగా ఆడడంతో ఇంగ్లాండ్ తొలి 3 ఓవర్లలోనే 20 పరుగులు చేసింది. అంతే, ఆ తరువాతి ఓవర్ లోనే బుమ్రా వారిని దెబ్బకొట్టాడు. వరుస బంతుల్లో డేవిడ్ మలన్ (16), జో రూట్ (0)లను ఔట్ చేశాడు. ఆపై కొద్దిసేపటికే షమీ.. బెన్ స్టోక్స్‌(0), జానీ బెయిర్ స్టో (8)లను పెవిలియన్ చేర్చడంతో మ్యాచ్ పై భారత్ పట్టు సాధించింది. ప్రస్తుతం బట్లర్‌(4), మోయిన్‌ అలీ(1) క్రీజులో ఉన్నారు.

అంతకుముందు భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(87), సూర్యకుమార్‌ యాదవ్‌ (49) పర్వాలేదనిపించారు.