IND vs ENG: ఖాతా తెరవని కోహ్లీ.. ప్రపంచ కప్‌లో తొలిసారి

IND vs ENG: ఖాతా తెరవని కోహ్లీ.. ప్రపంచ కప్‌లో తొలిసారి

లక్నో వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోహ్లి డ‌కౌట్ అయ్యాడు. 9 బాల్స్ ఎదుర్కొన్న కోహ్లీ ప‌రుగుల ఖాతా తెర‌వ‌కుండానే పెవిలియ‌న్ చేరాడు. ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీల్లో(టీ20లు, వన్డేలు) అతను డకౌట్ అవ్వడం ఇదే తొలిసారి. దీంతో భారత జట్టు 27 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. 

టాస్ ఓడి బ్యాటింగ్ ఆరంభించిన భారత్‌కు మంచి ఆరంభం లభించలేదు. దూకుడుగా ఆడే ప్రయత్నంలో  శుభ్‍మన్ గిల్ (9)   పరుగులకే పెవిలియన్ చేరాడు. డేవిడ్ విల్లీ వేసిన తొలి ఓవర్ మెయిడిన్ కాగా, అతని తదుపరి ఓవర్‌లో రోహిత్ శర్మ ఏకంగా 18 పరుగులు రాబట్టాడు. ఏడు ఓవర్లు ముగిసే సరికి భారత్ 2 వికెట్ల నష్టానికి 28 పరుగులు చేసింది. రోహిత్ (18), శ్రేయాస్ అయ్యర్(1) క్రీజులో ఉన్నారు.