IND vs NZ: జయహో టీమిండియా.. దేశవ్యాప్తంగా మళ్లీ దీపావళి

IND vs NZ: జయహో టీమిండియా.. దేశవ్యాప్తంగా మళ్లీ దీపావళి

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్ పోరులో టీమిండియా ఘనవిజయం సాధించింది. ఈ టోర్నీలో వరుసగా పదో విజయాన్ని అందుకొని టైటిల్ కు అడుగు దూరంలో నిలిచింది. మొదట కోహ్లీ(117), అయ్యర్(105) రాణించడంతో 397 పరుగుల భారీ స్కోర్ చేసిన భారత ఆటగాళ్లు.. అనంతరం కివీస్‌ను 327 పరుగులకే కట్టడి చేశారు. ఈ విజయంతో దేశవ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి.

మ్యాచ్ ముగియగానే భారత క్రికెట్ అభిమానులు వీధుల్లోకి వచ్చి.. జయహో భారత్.. జై భారత్.. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కొన్నిచోట్ల టపాసులు కాలుస్తూ మరో లెవెల్‌లో సెలెబ్రేషన్స్ చేసుకున్నారు. మరోసారి దీపావళి వచ్చిందేమో అన్నట్లుగా దేశం మొత్తం ఆనందంలోకి వెళ్లిపోయింది.  అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఫైనల్స్‌కు చేరిన భారత్ క్రికెట్ జట్టుకు అందరూ శుభాకాంక్షలు చెబుతున్నారు. వీధుల్లో పెద్ద ఎత్తున సంబరాలకు దిగారు కుర్రోళ్లు.. ఈసారి కప్ భారత్ దే అంటూ కేరింతలు కొడుతున్నారు.