న్యూఢిల్లీ: ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మన దేశంలోకి 100 బిలియన్ డాలర్ల ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ (ఎఫ్డీఐ) వస్తాయని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేసింది. ఎకనమిక్ రిఫార్మ్స్ చురుగ్గా అమలు చేయడంతో పాటు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మెరుగుపరచడంతో ఎఫ్డీఐలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేసింది. 2021–22 లో మనకు 83.6 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. మొత్తం 101 దేశాల నుంచి పెట్టుబడులు మన దేశంలోకి వస్తున్నాయి.
31 రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీలలో ఈ పెట్టుబడులు పెట్టారు. 57 సెక్టార్లలోకి విదేశీ పెట్టుబడులు వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఎక్కువ రంగాలలో ఆటోమేటిక్ రూట్లోనే పెట్టుబడులు పెట్టేందుకు వీలు కల్పించినట్లు పేర్కొంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ మొదటి మూడు నెలల్లో (ఏప్రిల్–జూన్) మాత్రం విదేశీ పెట్టుబడులు 6 % తగ్గి 16.6 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి.