తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇండియన్ క్రికెటర్లు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇండియన్ క్రికెటర్లు

ఇండియన్ క్రికెటర్లు రిషబ్ పంత్, అక్షర్ పటేల్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రాత్రి విఐపీల విరామసమయంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయక మండపంలో రిషబ్ పంత్, అక్షర్ పటేల్ కు వేద పండితుల వేద ఆశీర్వాదం, తీర్థ ప్రసాదాలను అర్చకులు అందజేశారు. భారత క్రికెటర్లకు టిటిడి అధికారులు ప్రోటోకాల్ దర్శనం ఏర్పాట్లు చేయడం చేశారు. ఆలయం వెలుపల వచ్చిన రిషబ్ పంత్, అక్షర్ పటేల్ తో భక్తులు, అభిమానులు సెల్పీలు దిగారు.

ఘోర కారు ప్రమాదం నుంచి బయటపడిన రిషబ్ పంత్.. ఇటీవల కోలుకున్నాడు.  మళ్లీ క్రికెట్ గ్రౌండ్ లోకి వచ్చేందుకు కసరత్తులు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందాడు. 

ALSO READ : విష్ణువు, శని భగవానుడికి ఇష్టమైన పుష్పం ఇదే.. దీనితో పూజించారంటే,,,