కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ అజయ్ ద్వారా ఇజ్రాయెల్ లో ఉన్న భారతీయులు స్వదేశానికి చేరుకుంటున్నారు. శుక్రవారం (అక్టోబర్ 13న) తెల్లవారుజామున 212 మంది భారతీయులు ఢిల్లీ విమానాశ్రయం చేరుకున్నారు. శనివారం (అక్టోబర్ 14న) మరో విమానం ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. ఈ సందర్భంగా ప్రయాణికులు పెద్దఎత్తున వందేమాతరం నినాదాలు చేశారు. ఈ విమానంలో 235 మంది భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చారు.
అక్టోబర్ 6వ తేదీన పాలస్తీనాలోని గాజా నుంచి హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ పట్టణాలపై దాడులకు దిగిన విషయం తెలిసిందే. 20 నిమిషాల్లో 5 వేలకుపైగా రాకెట్లతో హమాస్ మిలిటెంట్లు విరుచుకుపడ్డారు. ప్రతిగా ఇజ్రాయెల్ సైన్యం రంగంలోకి దిగింది. హమాస్ను నామరూపాల్లేకుండా చేయాలనే లక్ష్యంతో దాడలు చేస్తోంది.
ఇరువైపుల భారీగా ప్రాణ ఆస్తి నష్టం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఇజ్రాయిల్ లో చిక్కుకుపోయిన భారతీయులను కేంద్ర ప్రభుత్వం స్వదేశానికి క్షేమంగా తీసుకొస్తోంది. దీనికి ఆపరేషన్ అజయ్ అనే పేరు పెట్టింది. అత్యంత భయానక పరిస్థితుల నుంచి బయటపడి క్షేమంగా స్వదేశానికి చేరుకోవడంతో వారంతా ఊపిరిపీల్చుకున్నారు.
Also Read :- నిరుద్యోగుల ఆత్మహత్యలు.. ప్రభుత్వ హత్యలే
ఇజ్రాయెల్ లో నార్మల్ పరిస్థితులు లేవని, ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితులు ఉన్నాయని భారతకు వచ్చిన వాళ్లు చెబుతున్నారు. తమను క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
#OperationAjay continues to bring citizens home.
— Arindam Bagchi (@MEAIndia) October 14, 2023
2nd flight carrying 235 citizens arrives in New Delhi. MoS @RanjanRajkuma11 received the citizens at the airport. pic.twitter.com/W3ItmHgwf3