ఉత్తరాఖండ్ : ఇండో, టిబెటన్ బోర్డర్ పోలీసులు (ఐటీబీపీ) అరుదైన రికార్డు సృష్టించారు. 22వేల 850 అడుగుల ఎత్తులో యోగా చేశారు. ఉత్తరాఖండ్లోని మౌంట్ అబి గామిన్ పర్వతంపై పర్వతారోహణ బృందానికి చెందిన ఐటీబీపీ సిబ్బంది యోగా చేశారు. ఈ పర్వతం దాదాపు 22, 850 అడుగుల ఎత్తు ఉంటుందని అంచనా. యోగా చేసే సమయంలో ఈ పర్వతం పూర్తిగా మంచుతో కప్పి ఉంది. ఎత్తైన పర్వతంపై మంచులో నిలబడి ‘బద్రి విశాల్ కీ జై’ అని నినాదాలతో ఐటీబీపీ సిబ్బంది యోగా చేశారు. దాదాపు 230 మంది వరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ITBP mountaineers performed yoga at an altitude of 22,850 feet amid snow-capped terrain en route to Mount Abi Gamin summit in Uttarakhand, last week pic.twitter.com/mvY8O1kTPE
— ANI (@ANI) June 6, 2022
ఈ నెల 21న(జూన్ 21 ) జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. అబి గామిన్ పర్వతం సెంట్రల్ హిమాలయాలలోని జస్కర్ రేంజ్లో ఉంటుంది. అబి గామెన్ ఈ ప్రాంతంలో ఉన్న రెండో అతిపెద్ద పర్వతం. ఇండియా, టిబెట్ సరిహద్దులు పహారా కాసేందుకు ప్రత్యేకంగా ఏర్పాటైన దళమే ఐటీబీపీ. ఈ దళానికి పర్వతారోహణలోనూ మంచి పట్టు ఉంటుంది.
మరిన్ని వార్తల కోసం..