ఇండోనేషియాకు చెందిన ఓ మహిళ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమైనాయి. స్విమ్మింగ్ పూల్లో స్నానం చేయడం ద్వారా మహిళలు ప్రెగ్నెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.ఈ మాటలు అన్నది ఎవరో కాదు ఇండోనేషియాకు చెందిన శిశు సంక్షేమ శాఖకు చెందిన ఓ మహిళా అధికారి. ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
శిశు సంక్షేమ శాఖకు చెందిన అధికారి సిటీ హిక్మావట్టి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మాట్లాడారు. పురుషులతో పాటు అదే స్విమ్మింగ్ పూల్ లో మహిళలు కూడా స్నానం చేస్తే.. వారు గర్భం ధరించే అవకాశం వుందని కామెంట్స్ చేశారు. స్విమ్మింగ్ పూల్లో పురుషులు స్నానం చేసేటప్పుడు వారి స్పెర్మ్ నీటిలో కలుస్తుందని.. అది మహిళల శరీరంలో చేరితే ప్రెగ్నెంట్ అయ్యే అవకాశాలున్నట్లు ఆమె తెలిపారు.
అయితే సైన్స్ ప్రకారం నిరూపితం కాని ఈ విషయంపై ఓ అధికారి మాట్లాడటం ప్రస్తుతం వివాదాస్పదమైంది. ఈమె వ్యాఖ్యలపై పలువురు సెటైర్లు వేస్తూ కామెంట్లు చేస్తున్నారు.