బౌలింగ్‌‌‌‌‌‌‌‌ కాంబినేషన్‌‌‌‌‌‌‌‌పై దృష్టి..నేటి (జూన్ 13న) నుంచి ఇండియా ఇంట్రా స్క్వాడ్‌‌‌‌‌‌‌‌ వామప్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌

బౌలింగ్‌‌‌‌‌‌‌‌ కాంబినేషన్‌‌‌‌‌‌‌‌పై దృష్టి..నేటి (జూన్ 13న) నుంచి ఇండియా ఇంట్రా స్క్వాడ్‌‌‌‌‌‌‌‌ వామప్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌

బెకెన్‌‌‌‌‌‌‌‌హామ్‌‌‌‌‌‌‌‌ (కెంట్‌‌‌‌‌‌‌‌): ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌తో ఐదు టెస్ట్‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌‌‌‌‌‌‌‌కు టీమిండియా రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో నేటి నుంచి ఇండియా, ఇండియా–ఎ జట్ల మధ్య (ఇంట్రా స్క్వాడ్‌‌‌‌‌‌‌‌) నాలుగు రోజుల వామప్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ జరగనుంది. ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ ద్వారా ప్రధాన సిరీస్‌‌‌‌‌‌‌‌లో ఆడే ప్లేయర్ల ఫామ్‌‌‌‌‌‌‌‌, బౌలింగ్‌‌‌‌‌‌‌‌ కాంబినేషన్‌‌‌‌‌‌‌‌ను గుర్తించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా లెఫ్టార్మ్‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ రవీంద్ర జడేజా, లెఫ్టార్మ్‌‌‌‌‌‌‌‌ చైనామన్‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ కుల్దీప్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌ను నిశితంగా పరిశీలించనున్నారు.

జట్టు వ్యూహాలు, ప్లేయర్ల ఆటతీరుపై ప్రత్యర్థులకు ఎలాంటి సమాచారం లీక్‌‌‌‌‌‌‌‌ కాకుండా గంభీర్‌‌‌‌‌‌‌‌ బృందం  ‘క్లోజ్డ్‌‌‌‌‌‌‌‌ డోర్‌‌‌‌‌‌‌‌ సెషన్‌‌‌‌‌‌‌‌’ను ఎంచుకుంది. రోజుకు 90 ఓవర్లు బౌలింగ్‌‌‌‌‌‌‌‌, ఫీల్డింగ్‌‌‌‌‌‌‌‌ చేసే సామర్థ్యాన్ని పెంపొందించుకునే దిశగా టీమిండియా కసరత్తులు చేస్తోందని బౌలింగ్‌‌‌‌‌‌‌‌ కోచ్‌‌‌‌‌‌‌‌ మోర్నీ మోర్కెల్‌‌‌‌‌‌‌‌ వెల్లడించాడు. దాంతో సాధారణ నెట్‌‌‌‌‌‌‌‌ సెషన్స్‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే ఇది చాలా భిన్నంగా ఉండనుంది.

అధికారిక ఫస్ట్‌‌‌‌‌‌‌‌ క్లాస్‌‌‌‌‌‌‌‌ హోదా లేని ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఎవరైనాబ్యాటర్‌‌‌‌‌‌‌‌ త్వరగా ఔటైతే రెండో చాన్స్‌‌‌‌‌‌‌‌ ఇస్తారు. నాలుగు రోజుల్లో కలిపి 360 ఓవర్ల మ్యాచ్‌‌‌‌‌‌‌‌ జరుగుతుంది. బౌలర్లు తమకు కావాల్సినన్ని ఓవర్లు వేసుకునే వెసులుబాటు కూడా లభిస్తుంది. స్పిన్నర్‌‌‌‌‌‌‌‌, పేసర్‌‌‌‌‌‌‌‌ తమ బౌలింగ్‌‌‌‌‌‌‌‌ లయను సిమ్యులేషన్‌‌‌‌‌‌‌‌పై చూసుకోవచ్చు. ‘సెనా’ దేశాల పిచ్‌‌‌‌‌‌‌‌లపై జడేజా బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ అత్యుత్తమంగా ఉంటుంది.

కానీ ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ బజ్‌‌‌‌‌‌‌‌బాలర్స్‌‌‌‌‌‌‌‌కు వ్యతిరేకంగా కుల్దీప్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌ను బరిలోకి దించే చాన్స్‌‌‌‌‌‌‌‌ ఉంది. కాబట్టి తొలి టెస్ట్‌‌‌‌‌‌‌‌లో ఆడే ఏకైక స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ ఎవరనేది గంభీర్‌‌‌‌‌‌‌‌ బృందం వెతికి పట్టుకోవాల్సి ఉంది. ప్రధాన పేసర్‌‌‌‌‌‌‌‌గా బుమ్రాను ఆడించొచ్చు. అయితే బ్యాక్‌‌‌‌‌‌‌‌ పెయిన్‌‌‌‌‌‌‌‌ కారణంగా అతనితో ఎన్ని స్పెల్స్‌‌‌‌‌‌‌‌ వేయించాలో ఇందులో నిర్ణయించనున్నారు. ఫుల్లర్‌‌‌‌‌‌‌‌ లెంగ్త్‌‌‌‌‌‌‌‌ ఆకాశ్‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌, బ్యాక్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద లెంగ్త్‌‌‌‌‌‌‌‌ ప్రసిధ్‌‌‌‌‌‌‌‌ కృష్ణ మధ్య పోటీ నెలకొంది.