
తాజ్ మహల్ దగ్గర తాను దిగిన ఫొటోలను ఫొటోషాప్ చేయడంపై అమెరికా అధ్యక్షుడి కూతురు ఇవాంకా ట్రంప్ పాజిటివ్ గా స్పందించారు. తనపై ఇండియన్ యూత్ చూపించిన అభిమానానికి పొంగిపోతున్నానని ఆమె ట్విట్టర్ లో చెప్పారు. ట్రంప్ ఇండియా టూర్ లో భాగంగా… తన భర్త కుష్నర్ తో కలిసి తాజ్ మహల్ దగ్గర ఇవాంకా ట్రంప్ ఫొటోలు దిగారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సైకిల్ పై ఇవాంకా ఎక్కినట్టుగా.. ఆమె పక్కనే కూర్చున్నట్టుగా రకరకాలుగా ఫొటో షాప్ చేశారు అభిమానులు. తనను తాజ్ మహల్ కు తీసుకెళ్లిన ఫ్రెండ్స్ కు థాంక్స్ అంటూ కన్నుగీటే ఎమోజీతో రిప్లై ఇచ్చారు ఇవాంక.