జనగామ జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి గుండెపోటుతో మృతి

జనగామ జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి గుండెపోటుతో మృతి

జనగామ జెడ్పీ ఛైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. హనుమకొండలో నివాసం ఉంటున్న ఆయనకు సోమవారం (డిసెంబర్ 4న) సాయంత్రం గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ని హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 

సంపత్‌రెడ్డి ప్రస్తుతం జనగామ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్నారు. సంపత్‌రెడ్డి ఆకస్మిక మృతికి పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజా ప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

2023, జూన్ 11న బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు, జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ కూడా హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే.