ఖతర్ లో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ లో ఇవాళ జర్మనీ, జపాన్ మధ్య జరిగిన ‘గ్రూప్ –ఈ’ మ్యాచ్ లో అనూహ్య ఫలితం వచ్చింది. గతంలో 4సార్లు ఫుట్ బాల్ ప్రపంచ చాంపియన్ గా నిలిచిన జర్మనీని జపాన్ ఓడించింది. మ్యాచ్ ప్రథమార్ధం వరకు జర్మనీ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. జర్మనీ ఆటగాడు గుండోగన్ మ్యాచ్ 33వ నిమిషంలో గోల్ కొట్టడంతో.. ఆ టీమ్ 1 – 0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే ఆ తర్వాత (ద్వితీయార్ధంలో) సీన్ మారిపోయింది.
జపాన్ ఇద్దరు ఆటగాళ్లు రిస్తో డోన్, టకుమా అసానో రెచ్చిపోయి వరుసగా రెండు మెరుపు గోల్స్ చేశారు. దీంతో మ్యాచ్ పై జపాన్ పట్టు సంపాదించింది. గోల్స్ చేయకుండా చివరి వరకు జర్మనీని సమర్ధంగా కట్టడి చేసింది. జపాన్ ను విజయం వరించింది.
- ఇక మరో మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్, ఆస్ట్రేలియాపై 4 –1 తేడాతో విజయం సాధించింది.
- మొరాకో, క్రొయేషియా మధ్య జరిగిన ఇంకో మ్యాచ్ డ్రాగా ముగిసింది.