పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద కేసు
న్యూఢిల్లీ/శ్రీనగర్: మాజీ ఐఏఎస్ ఆఫీసర్, జమ్మూకాశ్మీర్ పీపుల్స్ మూవ్మెంట్(జేకేపీఎం) పార్టీ చీఫ్ షా ఫైజల్బుధవారం అరెస్టయ్యారు. ఢిల్లీ నుంచి ఇస్తాంబుల్(టర్కీ) వెళ్లే విమానం ఎక్కడానికి కొద్ది నిమిషాల ముందు ఎయిర్పోర్టులోనే ఆయన్ను సెక్యూరిటీ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. ఫైజల్ను అక్కణ్నుంచి తిరిగి శ్రీనగర్ పంపారు. పబ్లిక్ సేఫ్టీ యాక్ట్(పీఎస్ఏ) కింద ఆయనపై కేసు నమోదు చేసి హౌస్ అరెస్టులో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు, రాష్ట్ర విభజన తర్వాత ఫైజల్ లాంటి ఒకరిద్దర్ని తప్ప దాదాపు లీడర్లందరినీ పోలీసులు అరెస్టు చేశారు. రెండ్రోజులుగా ఫైజల్ పలు ఇంటర్నేషనల్ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ కేంద్ర సర్కారుపై తీవ్ర ఆరోపణలు చేశారు. మోడీ, షా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని విమర్శించారు.