
- కాగ్ డ్రాఫ్ట్ రిపోర్ట్, ఎన్డీఎస్ఏ నివేదిక, సీడబ్ల్యూసీ లేఖల ఆధారంగా తయారీ
- మేడిగడ్డలో కుంగిన పిల్లర్లు, పంపుహౌస్ల మునక
- కరెంట్బిల్లుల భారం సహా పలు కీలకాంశాల విశ్లేషణ
- ప్రాణహిత-చేవెళ్ల ప్రయోజనాలను వివరించే చాన్స్
- 29న మేడిగడ్డ వద్ద ప్రజెంటేషన్ఇవ్వనున్న మంత్రి ఉత్తమ్
కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం ఇవ్వనున్న పవర్పాయింట్ప్రజెంటేషన్(పీపీటీ) దాదాపుగా రెడీ అయ్యింది. ఇరిగేషన్శాఖలో పని చేసిన రిటైర్డ్చీఫ్ఇంజినీర్ఆధ్వర్యంలో దీన్ని తయారు చేస్తున్నారు. పలువురు ఇరిగేషన్ ఎక్స్పర్ట్లు పీపీటీ రూపొందించడంలో తోడ్పాటు అందిస్తున్నారు. ఇరిగేషన్శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ఈ పీపీటీకి ఓకే చెప్పిన తర్వాత ఫైనల్ప్రజెంటేషన్సిద్ధం చేయనున్నారు. గురువారం మధ్యాహ్నం వరకు ఫైనల్పీపీటీ రెడీ అయ్యే అవకాశముందని తెలుస్తున్నది. ఈ నెల 29న మేడిగడ్డ బ్యారేజీ వద్ద మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఈ ప్రజెంటేషన్ఇవ్వనున్నారు. ఐటీ, ఇండస్ట్రీస్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో పాటు ఆ రోజు అందుబాటులో ఉండే ఇతర మంత్రులు కూడా ఇందులో పాల్గొననున్నారు. మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన ఏడో బ్లాక్ను మంత్రులు, ఇంజనీర్లు పరిశీలిస్తారు. అక్కడ ఎల్అండ్టీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న మట్టికట్టను పరిశీలించి, బ్యారేజీ పునరుద్ధరణకు చేపట్టబోయే చర్యలపై సమీక్షిస్తారు. అక్కడే కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ఇతర ఇరిగేషన్ప్రాజెక్టులపై మంత్రి రివ్యూ చేస్తారు. ఆ తర్వాత టైమ్ ఉంటే అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించేలా మంత్రుల టూర్ షెడ్యూల్రూపొందిస్తున్నారు.
ప్రాణహిత–చేవెళ్ల లిఫ్ట్స్కీంను అప్పటి కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుగా రీడిజైన్చేయడం, ఈ క్రమంలో రాష్ట్ర ఇరిగేషన్డిపార్ట్మెంట్తో సీడబ్ల్యూసీ జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు, కేంద్రం నుంచి చేసిన సూచనలతో పీపీటీని ప్రారంభించే అవకాశమున్నట్టు తెలుస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కంప్ట్రోలర్అండ్ఆడిటర్జనరల్(కాగ్) 300 పేజీలతో కూడిన డ్రాఫ్ట్రిపోర్టు ఇచ్చింది. అందులో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయంలో తేడాలు, బ్యారేజీలు, పంపుహౌస్ల డిజైన్లలో లోపాలు, ప్రాజెక్టు భూ సేకరణ, ఆర్అండ్ఆర్ప్యాకేజీల్లో ఒక్కోచోట ఒక్కోలా వ్యవహరించడం, మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగడానికి దారితీసిన పరిస్థితులు, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరిస్థితి, కన్నెపల్లి, అన్నారం పంపుహౌస్లు మునగడానికి కారణాలు, దీంతో వాటిల్లిన నష్టం సహా ఇతర అన్ని వివరాలు పీపీటీలో ఉండనున్నట్టు తెలిసింది. నేషనల్డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) మేడిగడ్డ బ్యారేజీపై ఇచ్చిన రెండు రిపోర్టులు, అన్నారం బ్యారేజీలో బుంగలు ఏర్పడటంపై ఇచ్చిన రిపోర్టులోని ముఖ్య అంశాలను కూడా పెడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించిన నాటి నుంచి ఎత్తిపోసిన నీళ్లు, ఎగువ నుంచి వరద రావడంతో ఆ నీటిని కిందికి వదిలేయడం వల్ల పడిన కరెంట్బిల్లుల భారం, మొత్తం నీటిని ఎత్తిపోసినందుకు అయిన కరెంట్ చార్జీలు, ఆ నీటితో కొత్తగా
ఎంత ఆయకట్టును స్టెబిలైజ్ చేశారు అనే వివరాలన్నీ పొందుపరుస్తున్నారు.
‘తుమ్మిడిహెట్టి’పై వివరించే చాన్స్
తుమ్మిడిహెట్టి నుంచి నీటిని తరలిస్తే ప్రజలకు ఎంతమేరకు ఉపయోగం, రీ డిజైనింగ్తర్వాత కాళేశ్వరంలో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంపుహౌస్ల నిర్మాణంతో అదనంగా ప్రజలపై పడిన భారం వాటితో అదనంగా చేకూరే ప్రయోజనం ఏమైనా ఉందా అనే వివరాలను ప్రజంటేషన్లో పెడుతున్నారు. ప్రాణహిత – చేవెళ్ల రీ డిజైన్తర్వాత చేవెళ్ల ప్రాంతాన్ని కాళేశ్వరం నుంచి డిలీట్చేసి పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టులో చేర్చడం, ఆ పనులు చేపట్టకపోవడంతో గతంలో చేసిన పనులు ఎంతమేరకు వృథా అయ్యాయనే వివరాలను చేర్చుస్తున్నారు. చేవెళ్ల, పరిగి, తాండూరు, వికారాబాద్, కొడంగల్ప్రాంతాలకు ఎక్కడి నుంచి నీళ్లు ఇవ్వాలి.. ఒకవేళ కృష్ణాలో సరిపడా నీళ్లు లేకుంటే కాళేశ్వరం నుంచి తీసుకోవడానికి ఉన్న అవకాశాలు ఏమిటో కూడా వివరించే ఆస్కారమున్నట్టు తెలిసింది. రూ.37 వేల కోట్లతో చేపట్టిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టులో 2014 జూన్2వ తేదీ నాటికే సుమారు రూ.8 వేల కోట్లకు పైగా పనులు పూర్తయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్టుగా రీ డిజైన్చేసిన తర్వాత ఖర్చు చేసిన మొత్తంలో ఎంత మేరకు ఉపయోగపడింది.. ఎన్ని పనులు ఉపయోగించుకున్నారు.. ఎన్ని వృథా అయ్యాయి.. వాటిని ఇప్పుడు ఏ రకంగానైనా ఉపయోగించుకునే అవకాశముందా అనే వివరాలను పీపీటీలో చేర్చుతున్నట్టు తెలుస్తోంది.