శాఖల మధ్య కో ఆర్డినేషన్​ లేక అసంపూర్తిగా రోడ్లు

శాఖల మధ్య కో ఆర్డినేషన్​ లేక అసంపూర్తిగా రోడ్లు

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలో పలు రోడ్లు అసంపూర్తిగా ఉన్నాయి. ఫారెస్ట్​ ఏరియాలో నుంచి వెళ్తున్న రోడ్లు, రోడ్ల వెడల్పు పనుల్లో శాఖల మధ్య కో ఆర్డినేషన్​ లేకపోవడం సమస్యగా మారింది. ఫారెస్ట్​ ఏరియాల్లో నుంచి కొత్తగా వేస్తున్న రోడ్లు, డబుల్​ రోడ్లుగా మార్చాల్సిన సమయంలో సంబంధిత శాఖ పర్మిషన్​ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఆర్అండ్​బీ, పంచాయతీరాజ్, ఫారెస్ట్​ ఆఫీసర్ల మధ్య కో ఆర్డినేషన్​ లేకపోవడం సమస్యగా మారుతోందనే విమర్శలున్నాయి. గాంధారి, నాగిరెడ్డిపేట, లింగంపేట, తాడ్వాయి, మాచారెడ్డి, రామారెడ్డి మండలాల్లో ఈ సమస్య ఉంది. 

చర్చకు వచ్చినా..

ఫారెస్ట్​ ఏరియాలో నుంచి వేసే రోడ్ల విషయం పలుమార్లు జడ్పీ మీటింగ్​లో ప్రస్తావనకు వచ్చింది. రోడ్ల కోసం వచ్చిన ఫండ్స్​ వెనక్కి వెళ్తున్నాయని సభ్యులు ఫైర్​ అయ్యారు. ఇంజనీరింగ్, ఫారెస్ట్​ ఆఫీసర్ల మధ్య కో ఆర్డినేషన్​ లేకపోవడం ప్రధాన సమస్యగా మారుతోందని సభ్యులు వాపోతున్నారు. ప్రపోజల్  పంపే ముందు క్లియరెన్స్​ కోసం లెటర్​ రాస్తున్న ఇంజనీరింగ్​ ఆఫీసర్లు, ఆ తరువాత ఫారెస్ట్​ డిపార్ట్​మెంట్​ వద్ద ఉన్న ఫైల్స్​ను ఫాలోఅప్​​చేయడంలో చొరవ చూపడం లేదనే విమర్శలున్నాయి. సింగిల్​ రోడ్డును డబుల్ రోడ్​గా మారిస్తే   అభ్యంతరం తెలపడంపై ప్రజాప్రతినిధులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు చొరవ చూపి అసంపూర్తిగా ఉన్న రోడ్ల పనులు కంప్లీట్​చేయించాలని కోరుతున్నారు.

‘ఇది  గాంధారి నుంచి బాన్స్​వాడ వెళ్లే రోడ్డు. ప్రతిరోజు వందలాది వెహికల్స్​ రాకపోకలు సాగిస్తాయి. సింగిల్​గా ఉన్న రోడ్డును ఐదేండ్ల కింద డబుల్​ రోడ్డుగా మార్చారు. మధ్యలో కొన్ని కిలో మీటర్లు ఫారెస్ట్​ ఏరియాలో నుంచి వెళ్తుంది. బాన్స్​వాడ మండల పరిధిలో ఫారెస్ట్​ క్లియరెన్స్​ రావడంతో ఇక్కడ డబుల్​ రోడ్డు వేశారు. గాంధారి మండలం పెద్ద పొతంగల్​ శివారులో 3కిలోమీటర్లు క్లియరెన్స్​ లేక పనులు  చేయలేదు. జడ్పీ మీటింగ్​లో ప్రజాప్రతినిధులు పలుమార్లు ప్రస్తావించినా ఇప్పటికీ క్లియరెన్స్​ రాలేదు. ఇలా జిల్లాలో పలు రోడ్లు చిన్న కారణాలతో ముందుపడ్తలేవు.’

తాడ్వాయి మండలం నందివాడ నుంచి లింగంపేట మండలం కొమట్​పల్లి వైపు ఏడేండ్ల కింద రోడ్డు నిర్మాణం చేపట్టారు. మధ్యలో కొంత ఫారెస్ట్​ ఏరియా ఉంది. పర్మిషన్​ లేకుండా పనులు చేయవద్దని ఫారెస్ట్​ ఆఫీసర్లు చెప్పడంతో నిలిచిపోయాయి. నాగిరెడ్డిపేట మండలం తాండూర్​ వైపు వెళ్లే  రోడ్డు కొంత భాగం క్లియరెన్స్​ రాక సింగిల్​ రోడ్డుగానే ఉంది. మాచారెడ్డి మండలం పల్వంచ నుంచి  బీబీపేట మండలం జనగామ వరకు డబుల్​ రోడ్​ పనులు రెండేండ్ల కింద ప్రారంభించారు. అంబారీపేట సమీపంలో ఫారెస్ట్​ ఏరియా ఉండడంతో పనులను నిలిపివేయాల్సి వచ్చింది. రోడ్డు పనులు నిలిపేయడంపై జడ్పీ మీటింగ్​లో ఎమ్మెల్యే గంప గోవర్ధన్,  మండల ప్రజాప్రతినిధులు ఫారెస్ట్​ ఆఫీసర్లను నిలదీశారు. రామారెడ్డి మండల కేంద్రం నుంచి మద్దికుంట వైపు డబుల్​ రోడ్డుగా మార్చినప్పటికీ, అటవీ ప్రాంతంలో మాత్రం సింగిల్​రోడ్డే ఉంది.