దసరా బూస్ట్.. కరీంనగర్ ఆర్టీసీ డిపోకు భారీ ఆదాయం

దసరా బూస్ట్.. కరీంనగర్ ఆర్టీసీ డిపోకు భారీ ఆదాయం

కరీంనగర్ ఆర్టీసీ డిపోకు దనరా పండుగ కలిసొచ్చింది. భారీ సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగించారు. కరీంనగర్ రీజియన్ లో ఆర్టీసీకి రూ. 7 కోట్ల 71 లక్షల 67 వేల ఆదాయం వచ్చినట్లు రీజనల్ మేనేజర్ ఖుస్రో షా ఖాన్ వెల్లడించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. గత నెల 23 నుంచి ఈ నెల 10 వరకు రీజియన్ లోని అన్ని డిపోల నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్ మధ్య నడిచిన బస్సుల ద్వారా ఆదాయం సమకూరినట్లు తెలిపారు. రెగ్యులర్, అదనపు సర్వీసుల ద్వారా కరీంనగర్ రీజియన్ 19,01,041 కిలో మీటర్లు నడిపినట్లు వెల్లడించారు. ప్రయాణీకులు ఎంతో ఆదరణ  చూపి సురక్షిత ప్రయాణం కోసం ఆర్టీసీ సేవలను వినియోగించుకొన్నందుకు ప్రయాణీకులకు ధన్యవాదాలు తెలియచేస్తున్నామన్నారు. ఇక ముందు కూడా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. 

డిపో ట్రిప్పులు కిలోమీటర్లు ఆదాయం
గోదావరి ఖని 605 310278 13193765
హుస్నాబాద్ 193 65744 2621024
హుజురాబాద్ 98 41114 1558437
కరీంనగర్ -1 794 258640 11060479
కరీంనగర్ -2 519 162239 6761311
మంథని 266 148895 5810292
జగిత్యాల 561 298639 12280828
కోరుట్ల 292 138331 5642325
మెట్ పల్లి 277 241439 9067452
సిరిసిల్ల 105 31546  1099233
వేముల వాడ 462 204176 8071859
రీజియన్ 4172 1901041 77167005