పెట్​ చచ్చిపోయిందని.. ఎమ్మెల్యే టూర్​ క్యాన్సిల్​

పెట్​ చచ్చిపోయిందని.. ఎమ్మెల్యే టూర్​ క్యాన్సిల్​

అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కోతి చనిపోవడంతో కర్ణాటక మాజీ మంత్రి, జేడీఎస్‌‌ ఎమ్మెల్యే ఎస్‌‌ఆర్‌‌ మహేశ్‌‌ తన సింగపూర్‌‌ టూర్‌‌ను మధ్యలోనే రద్దు చేసుకున్నారు. ఆయన పెంచుకుంటున్న చింటూ అనే మూడేళ్ల కోతి జనవరి 1న కరెంట్​ షాక్​ కొట్టి చనిపోయింది. మైసూరు శివార్లలోని దత్తగల్లిలో ఉన్న మహేశ్​ పొలంలో కింద పడిన కరెంట్​ తీగలపై పడి చనిపోయింది. అప్పటికే న్యూ ఇయర్‌‌ టూర్‌‌లో ఉన్న మహేశ్‌‌కు  కుటుంబ సభ్యులు మర్నాడే ఫోన్​ చేసి జరిగిన విషయం చెప్పారు. వెంటనే రిటర్న్‌‌ ఫ్లైట్‌‌లో వచ్చి కోతి అంత్యక్రియలకు హాజరయ్యారు. ఆ కోతికి రెండు నెలలున్నప్పుడు చుంచనకట్టి నుంచి మహేశ్​ తెచ్చుకున్నారట.