కర్ణాటకలో మాస్క్ మస్ట్.. కరోనా ముప్పు నేపథ్యంలో అలర్ట్

కర్ణాటకలో మాస్క్ మస్ట్.. కరోనా ముప్పు నేపథ్యంలో అలర్ట్

మళ్లీ కరోనా మహమ్మారి విరుచుకుపడే ముప్పు ఉందనే హెచ్చరికల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. సినిమా థియేటర్లు, స్కూళ్లు, కాలేజీల లోపల ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ను ధరించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. పబ్ లు, రెస్టారెంట్లు, బార్లలో కొత్త సంవత్సరం వేడుకల్లో పాల్గొనేవారు కూడా మాస్క్ ను విధిగా ధరించాలని నిర్దేశించింది.

కొత్త సంవత్సరం వేడుకలను డిసెంబరు 31న రాత్రి 1 గంటల్లోగా ముగించాలని స్పష్టం చేసింది. అయితే ప్రజలు కరోనా గురించి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటే సరిపోతుందని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది.  ఈ మార్గదర్శకాలన్నీ తక్షణమే అమల్లోకి వస్తాయని తేల్చి చెప్పింది.