కొత్తపల్లి లోని అల్ఫోర్స్‌‌లో కార్తీక పౌర్ణమి వేడుకలు

 కొత్తపల్లి లోని అల్ఫోర్స్‌‌లో  కార్తీక పౌర్ణమి వేడుకలు

కొత్తపల్లి, వెలుగు: కొత్తపల్లి పట్టణంలోని అల్ఫోర్స్​ఇ టెక్నో స్కూల్‌‌లో మంగళవారం కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అల్ఫోర్స్​ విద్యాసంస్థల చైర్మన్​ వి.నరేందర్​రెడ్డి శివుడి ఫొటోకు పూలమాలలు వేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ కార్తీక మాసం అత్యంత పవిత్రమైందన్నారు. ఈనెలలో పూజలు, వ్రతాలు చేస్తే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయన్నారు.